1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. క్రైం న్యూస్
Written By జె
Last Modified: మంగళవారం, 8 మార్చి 2022 (23:32 IST)

స్నేహితుడి భార్యను కోర్కె తీర్చమంటూ వేధింపులు, భర్తకి చెప్పుకోలేక భార్య ఆత్మహత్య

వాళ్ళిద్దరు ప్రాణ స్నేహితులు. ఇద్దరికీ పెళ్ళిళ్ళు అయ్యాయి. ఒక అతనికి సంవత్సరంలో పిల్లలు పుట్టారు. మరొక స్నేహితుడికి ఇంకా పిల్లలు పుట్టలేదు. స్నేహితులు కావడంతో ఒకరి ఇంటికి మరొకరు వచ్చి వెళుతుండేవారు.


అయితే స్నేహితుడి భార్యను సోదరిగా భావించాల్సిన వ్యక్తి వక్రబుద్ధిని చూపించాడు. ఆమెకు ఫోన్ చేసి వల్గర్‌గా మాట్లాడేవాడు. తన భర్తకు ఆ విషయం చెబితే వారిద్దరి స్నేహం చెడిపోతుందని మనస్సులోను దాచుకుంది ఆ వివాహిత.. చివరకు..

 
తెలంగాణా రాష్ట్రం మంచిర్యాల జిల్లా దండేపల్లి మండలం ముత్యంపేటకు చెందిన వివాహిత మౌనిక మూడురోజుల క్రితం ఇంట్లో నుంచి వాంతులు చేసుకుంటూ బయటకు వచ్చింది. దీంతో హుటహుటిన కుటుంబ సభ్యులు ఆమెను ఆసుపత్రిలో చేర్పించారు. కానీ ఆమె చికిత్స పొందుతూ చనిపోయింది.

 
కానీ తన సెల్ ఫోన్‌లో ఏం జరిగిందన్న విషయాన్ని స్పష్టంగా ఆడియో ద్వారా తెలిపింది. తన భర్త అంటే తనకు ఎంతో ఇష్టమని.. ఇంకా పిల్లలు లేకపోయినా ఆనందంగా ఉన్నానని చెప్పింది. తన భర్త స్నేహితుడు ప్రతాప్ తనతో అసభ్యంగా ప్రవర్తించేవాడని... సెల్ ఫోన్లో ఏవేవో మాట్లాడుతూ ఉండేవాడని చెప్పింది.

 
ఈవిషయం తన భర్తకు చెబితే వారిద్దరి మధ్య స్నేహం విడిపోతుందని.. గొడవలు అవుతాయని కూడా అందులో తెలిపింది. విషయం కాస్త బయటకు రావడంతో ప్రతాప్ ఆవేదనకు గురయ్యాడు. తన స్నేహితుడి భార్య తన వల్ల చనిపోయిందన్న బాధతో రైలు కింద పడి చనిపోయాడు. ప్రతాప్ చేసిన పనికి రెండు కుటుంబాలు చిన్నాభిన్నమయ్యాయి. ప్రతాప్ సంవత్సరం బిడ్డ ఉంది. ప్రతాప్ భార్య బోరున విలపిస్తూ ఉంది. కుటుంబ సభ్యులు ఆమెను ఓదార్చలేకపోతున్నారట.