1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. క్రైం న్యూస్
  4. eluru : west godavari fire accident in eluru two women burnt alive

ఏలూరులో దారుణం.. ఇద్దరు వృద్ధ మహిళల సజీవదహనం

fire
ఏపీలోని ఏలూరు జిల్లాలో దారుణం జరిగింది. ఇద్దరు వృద్ధ మహిళలు సజీవదహనమయ్యారు. వేలేరుపాడు గ్రామంలో మంగళవారం తెల్లవారుజామున ఒక ఇంట్ల మంటలు చెలరేగడంతో ఇద్దరు వృద్ధులు కాలిపోయారు. ఈ ఘటనతో గ్రామంలో తీవ్ర విషాదం నెలకొంది. 
 
స్థానికుల కథనం మేరకు... వలగని సావిత్రి (60), పూలమ్మ (65) అనే ఇద్దరు మహిళలు ప్రమాద సమయంలో ఇంట్లోనే నిద్రిస్తున్నారు. ఇంట్లో చెలరేగిన మంటలు ఒక్కసారిగా వేగంగా వ్యాపించడంతో వారు బయటకు రాలేకపోయి అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. 
 
మృతుల్లో ఒకరైన పూలమ్మ తెలంగాణాలోని సూర్యాపేట నివాసి. ఆమె తన సోదరి సావిత్రి ఇంటికి చుట్టపు చూపుగా వచ్చారు. ఈ ప్రమాదంలో ఇల్లు పూర్తిగా కాలి బూడిదైంది. మంటల తీవ్రతకు పక్కనే ఉన్న మరో ఇంటికి కూడా నష్టం వాటిల్లింది. 
 
సమాచారం అందుకున్న వెంటనే అగ్నిమాపక సిబ్బంది, స్థానిక అధికారులు ఘటనా స్థలానికి చేరుకున్న మంటలను అదుపులోకి తెచ్చారు. ప్రమాదవశాత్తు మంటల చెలరేగి ఉండవచ్చని ప్రాథమికంగా భావిస్తున్నారు. అయితే, పమాదానికి గల ఖచ్చితమైన కారణాలపై అధికారులు దర్యాప్తు చేస్తున్నారు. ఈ ఘటనకు సంబంధించి పూర్తి వివరాతు తెలియాల్సివుంది. 
About Writer
ఠాగూర్
తర్వాతి కథనం
జనసేన ఊపిరిలూదుకున్నది తెలంగాణ గడ్డపైనే : పవన్ కళ్యాణ్