1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. క్రైం న్యూస్
Written By వరుణ్
Last Updated : సోమవారం, 2 జనవరి 2023 (12:48 IST)

మైనర్ బాలికపై పెద్దనాన్న అత్యాచారం.. ఎక్కడ?

మధ్యప్రదేశ్ రాష్ట్రంలోని భోపాల్‌‍లో ఒక అమానవీయ ఘటన జరిగింది. వరుసకు కుమార్తె అయ్యే మైనర్ బాలికపై పెద్దనాన్న అత్యాచారానికి పాల్పడ్డాడు. ఆ తర్మాత మర్మాంగాల్లో నొప్పిని భరించలేని ఆ  బాలిక జరిగిన విషయాన్ని కన్నతల్లికి చెప్పడంతో ఈ దారుణం వెలుగులోకి వచ్చింది. దీనిపై పోలీసులు కేసు నమోదు చేసి పరారీలో ఉన్న కామాంధుడి కోసం గాలిస్తున్నారు. 
 
పోలీసుల కథనం మేరకు.. రాటిబాద్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఓ మహిళ ఉమ్మడి కుటుంబంతో నివాసం ఉంటుంది. ఆమెకు ముగ్గురు కుమార్తెలు కాగా, ఈమె భర్త ఆర్నెల్ల క్రితం చనిపోయాడు. దీంతో పలు ఇళ్లలో పాచిపని చేసుకుంటూ తన బిడ్డలను పోషించుకుంటూ అత్తారింటిలోనే ఉంటుంది. 
 
అయితే, గురువారం రాత్రి చిన్న కుమార్తె ఏడుస్తూ కనిపించింది. ఎంత ఓదార్చినా ఏడుపు ఆపలేదు. దీంతో ఆ బాలిక మర్మాంగాల్లో నొప్పిగా ఉందని చెప్పడంతో తల్లి కుమార్తె మర్మాంగాన్ని పరిశీలించి, ఏం జరిగిందని అడిగింది. దీంతో పెద్దనాన్న తనపై జరిపిన అఘాయిత్యాన్ని వివరించింది. ఆ తర్వాత పోలీసులకు ఫిర్యాదు చేయడంతో కేసు నమోదు చేసి, పరారీలో ఉన్న నిందితుడి కోసం కోసం గాలిస్తున్నారు.