సంబంధిత వార్తలు
- కన్నతండ్రే కాల యముడయ్యాడు.... కన్నకొడుకును కొట్టి చంపేసిన తండ్రి.. ఎక్కడ?
- అతడు ఓ అనుమానపు పురుగు, పక్కా ప్రణాళికతోనే నా కుమార్తెను హత్య చేసాడు: రాధాగాయత్రి తండ్రి
- కేతన్ను ప్రియుడితో కలిసి చంపేశాం.. పారిపోతే పరువు పోతుందని.. సియా
- బిగ్ బాస్ 10 సీజన్లో అడుగుపెట్టాలని వుంది, నన్ను సెలక్ట్ చేయండి: నంద్యాల ఎస్ఐ సెల్ఫీ వీడియో
- కేతన్ హత్య : సోదరి నిలదీతతో హత్యగా మారిన సెల్ఫీ ప్రమాద కేసు
మానసికస్థితి సరిగా లేని కొడుకు నిత్యం వేధిస్తున్నాడనీ కడతేర్చిన తండ్రి...
మానసికస్థితి సరిగా లేని కొడుకు నిత్యం వేధిస్తున్నాడనీ కన్నతండ్రి కడతేర్చాడు. ఆ తండ్రి క్షణికావేశం కన్నకొడుకు ప్రాణాలు పోయాయి. మానసిక పరిస్థితి సరిగ్గా లేని కుమారుడు నిత్యం వేధిస్తుండటంతో ఆందోళనకు గురైన తండ్రి కట్టెతో కొట్టి చంపాడు. ఈ ఘటన నంద్యాల జిల్లా కోవెలకుంట్ల మండలం కంపమల్లలో బుధవారం జరిగింది.
స్థానిక పోలీసుల కథనం మేరకు.. గ్రామానికి చెందిన వసుంధరరావు, లీలావతి దంపతులకు కుమారుడు, కుమార్తె సంతానం. పెద్దవాడైన వంశీకృష్ణ (22) బెంగళూరులో బీసీఏ చదివి, ఆరు నెలలుగా ఇంటివద్దే ఉంటున్నాడు. అతడి మానసిక పరిస్థితి సరిగ్గా లేక ఇంట్లో గొడవపడుతూ తల్లిదండ్రులను వేధించేవాడు.
ఈ క్రమంలో బుధవారం రాత్రి తల్లిని కొట్టి ఇంట్లోని వస్తువులను పగలగొట్టి భయభ్రాంతులకు గురిచేశాడు. వంశీకృష్ణ బతికుంటే తమను చంపుతాడేమోనని భయపడిన తండ్రి... అతడి తలపై కట్టెతో కొట్టి చంపాడని ఎస్ఐ తెలిపారు. ఈ ఘటనపై వంశీకృష్ణ తల్లి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేశామన్నారు.
