1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. క్రైం న్యూస్
Written By ఠాగూర్
Last Updated : శుక్రవారం, 8 అక్టోబరు 2021 (10:04 IST)

చాక్లెట్ల ఆశ చూపి నెల రోజులుగా మైనర్ బాలికపై అత్యాచారం... ఎక్కడ?

తెలంగాణా రాష్ట్రంలోని నిజామాబాద్ జిల్లాలో దారుణం జరిగింది. ఇద్దరు మైనర్ బాలికలను ఓ కామాంధుడు చెరిపాడు. చాక్లెట్ల ఆశ చూపి నెల రోజులు పాటు ఈ దారుణానికి పాల్పడ్డాడు. 
 
తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే, నిజామాబాద్​నగర శివారు కాలనీలో వసీం(30) అనే వ్యక్తి తాపీ మేస్త్రీగా పని చేస్తున్నాడు. ఈయన 8, 11 సంవత్సరాల వయస్సున్న ఇద్దరు బాలికలకు చాక్లెట్ల ఆశ చూపి వారిపై అత్యాచారానికి పాల్పడ్డాడు. 
 
ఈ దారుణం నెల రోజులకుపైగా సాగింది. ఈ విషయం ఇంట్లో తెలియడంతో వెలుగులోకి వచ్చింది. తల్లిదండ్రుల ఫిర్యాదుతో నిందితుడిని గురువారం ఉదయం 11 గంటల ప్రాంతంలో పోలీసులు అరెస్టు చేశారు. అతనిపై ఫోక్సో చట్టం కింద కేసు నమోదు చేసి విచారణ జరుపుతున్నారు.