1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. క్రైం న్యూస్
  4. Nursing Students committed Suicide by Hanging

ఫెసర్ల వేధింపులు.. నర్సింగ్ విద్యార్థిని ఆత్మహత్య

suicide
తమిళనాడు రాష్ట్రంలో విద్యార్థినిలు వరుస ఆత్మహత్యలకు పాల్పడుతున్నారు. తాజాగా వేలూరు జిల్లాలోని గుడియాత్తంకు చెందిన ఓ నర్సింగ్ కాలేజీ విద్యార్థిని ఆత్మహత్యకు పాల్పడింది. ప్రొఫెసర్ల వేధింపుల వల్లే తమ కుమార్తె ఆత్మహత్య చేసుకుందని మృతురాలి తల్లిదండ్రులు ఆరోపిస్తున్నారు.
 
గుడియాత్తం పట్టణానికి చెందిన కుమరేశన్ అనే వ్యక్తి కుమార్తె కార్తీక దేవి (21) ఏపీలోని చిత్తూరు జిల్లా అరకొండ ప్రాంతంలోని ఓ ప్రైవేటు నర్సింగ్ కాలేజీలో నర్సింగ్ చివరి సంవత్సరం చదవుతోంది.
 
ఈమెను విభాగాధిపతితో పాటు ఇతర అధ్యాపక సిబ్బంది కూడా వేధింపులకు గురి చేసినట్టు ఆరోపణలు ఉన్నాయి. ఈ వేధింపులు భరించలేని కార్తీకదేవి బలవన్మరణానికి పాల్పడినట్టు తెలుస్తుంది. దీనిపై సమాచారం అందుకున్న పోలీసులు కేసు నమోదు చేసి విచారణ జరుపుతున్నారు. 
About Writer
ఠాగూర్
తర్వాతి కథనం
కైరో అబు సిఫైనే చర్చిలో ఘోరం..41 మంది సజీవదహనం