సంబంధిత వార్తలు
- సొంత పార్టీ ఎంపీకి సారి చెప్పిన రేవంత్ రెడ్డి
- తెలంగాణ స్టేట్ హైకోర్టుకు కొత్తగా మరో ఆరుగురు జడ్జీలు
- తెలంగాణాలో అత్యుత్తమంగా జీవించేందుకు వినియోగదారుల ఎంపికలను కంట్రీ డిలైట్ ఏవిధంగా మారుస్తోంది?
- తెలంగాణ రాష్ట్రంలో తొలి కేజీ టు పీజీ విశ్వవిద్యాలయం
- "సారు దొర - సెలవు దొర" పోస్టర్లకు ఈసీ నో.. షాకైన తెలంగాణ బీజేపీ
జనగామలో ప్రేమ జంట సెల్ఫీ సూసైడ్
తెలంగాణ రాష్ట్రంలో జనగామలో విషాదం చోటుచేసుకుంది. ఓ ప్రేమ జంట సెల్ఫీ ఆత్మహత్య చేసుకుంది. ఈ జంట బలవన్మరణానికి పాల్పడేముందు సెల్ఫీ వీడియో తీసుకుంది. ఈ ఘటన స్థానికంగా కలకలం రేపుతోంది.
పాలకుర్తి మండలం బిక్యానాయక్ తండాలో వెలుగు చూసిన ఈ విషాదకర ఘటన వివరాలను పరిశీలిస్తే... బిక్యానాయక్ తండాకు చెందిన గగులోతు రాజు (20), బానోతు దీపిన (16) అనే యువతీ యువకులు ప్రేమించుకుని పెళ్లి చేసుకోవాలని భావించారు. దీనికి ఇరు కుటుంబాల పెద్దలు తీవ్రంగా వ్యతిరేకించారు.
దీంతో మనస్తాపానికు గురైన ఈ జంట... తీవ్రమనస్తాపానికి గురై ఆత్మహత్య చేసుకుంది. ఆ సమయంలోనే వారిద్దరూ సెల్ఫీ వీడియో తీసుకుని, పురుగుల మందు సేవించి బలవన్మరణానికి పాల్పడ్డారు. అయితే, దురదృష్టవశాత్తు ప్రియుడు ప్రాణాలు కోల్పోగా, ఆ యువతి ప్రాణాపాయ స్థితిలో ఆస్పత్రిలో చికిత్స పొందుతుంది.
తర్వాతి కథనం
