శుక్రవారం, 19 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. క్రైం న్యూస్
Written By ఠాగూర్
Last Updated : బుధవారం, 10 నవంబరు 2021 (09:43 IST)

థానెలో దారుణం.. వృద్ధురాలిపై సెక్యూరిటీ గార్డు అత్యాచారం

మహారాష్ట్రలోని థానె జిల్లాలో దారుణం జరగింది. 65 యేళ్ల వృద్ధురాలిపై 25 ఏళ్ల సెక్యూరిటీ గార్డు అత్యాచారానికి పాల్ప‌డ్డాడు. తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే,  
 
థానే న‌గ‌రంలోని ఓ హౌసింగ్ సొసైటీలో సెక్యూరిటీగార్డుగా ప‌నిచేస్తున్న 25 ఏళ్ళ యువ‌కుడు మంచినీళ్ల కోసం ఓ ఇంట్లోకి వెళ్లాడు. ఆ ఇంట్లో ఉన్న వృద్ధురాలి తాగ‌డానికి మంచినీళ్లు ఇవ్వ‌మ‌ని అడిగాడు. 
 
దీంతో ఆమె నీళ్లు తీసుకుని వ‌చ్చేలోపు ఒంట‌రిగా ఉన్న‌ద‌ని గ‌మ‌నించి అత్యాచారానికి పాల్ప‌డ్డాడు. ఈ నెల 3న ఈ ఘ‌ట‌న చోటుచేసుకోగా.. అదేరోజు వృద్ధురాలు పోలీసుల‌కు ఫిర్యాదు చేసింది. 
 
దీనిపై కేసు న‌మోదుచేసి నిందితుడి కోసం గాలింపు చేప‌ట్టిన పోలీసులు మంగళవారం అదుపులోకి తీసుకున్నారు. అత‌నిపై సంబంధిత సెక్ష‌న్‌ల కింద కేసులు న‌మోదు చేశారు.