హైదరాబాద్లో ఎంబీబీఎస్ విద్యార్థిని ఆత్మహత్య
హైదరాబాద్ నగరంలో మరో వైద్య విద్యార్థిని ఆత్మహత్య చేసుకుంది. ఎంబీబీఎస్ కోర్సును విజయవంతంగా పూర్తి చేసి నీట్ పీజీ ప్రవేశ పరీక్ష కోసం సిద్ధమవుతున్న ఆ విద్యార్థిని ఆత్మహత్య చేసుకుంది. ఆర్టీసీ క్రాస్ రోడ్స్ ప్రాంతంలో ఈ ఘటన జరిగింది. మృతురాలిని కర్నూలుకు చెందిన వ్యాపారి రామ్మోహన్ రెడ్డి ఏకైక కుమార్తె యశ్వితగా పోలీసులు గుర్తించారు.
యశ్విత గత ఆరు నెలలుగా హైదరాబాద్లో నివాసమంటూ పోస్ట్ గ్రాడ్యుయేట్ మెడికల్ ఎంట్రెన్స్ టెస్ట్ కోసం శిక్షణ పొందుతోంది. శనివారం ఆమె తాను బస చేస్తున్న గదిలోనే బలవన్మరణానికి పాల్పడింది. సమాచారం అందుకున్న చిక్కడపల్లి పోలీసులు తక్షణమే ఘటనా స్థలానికి చేరుకుని వివరాలు సేకరించారు.
ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. యశ్విత ఆత్మహత్యకు గల ఖచ్చితమైన కారణాలు ఇంకా తెలియరాలేదని, విచారణ కొనసాగుతోందని పోలీసులు వెల్లడించారు. ఏకైక కుమార్తె మృతితో ఆమె కుటుంబ సభ్యుల తీవ్ర శోకసముద్రంలో మునిగిపోయారు.
