శుక్రవారం, 29 మార్చి 2024
  1. ఇతరాలు
  2. ఆరోగ్యం
  3. కథనాలు
Written By సెల్వి
Last Updated : గురువారం, 28 నవంబరు 2019 (11:50 IST)

డయాబెటిస్ పేషెంట్లు స్ట్రాబెర్రీలు తింటే?

డయాబెటిస్ పేషెంట్లు స్ట్రాబెర్రీలు, నారింజ పండ్లు, చెర్రీలు తీసుకోవచ్చు. వీటిలో ఎక్కువగా ఉండే విట‌మిన్ సి టైప్ 2 డ‌యాబెటిస్‌ను అదుపు చేయ‌డంలో బాగా ప‌నిచేస్తుంది. అలాగే యాపిల్ పండ్లు, అవ‌కాడోలలో ఉండే ఫైబ‌ర్ కూడా ర‌క్తంలోని గ్లూకోజ్ స్థాయిల‌ను అదుపు చేస్తాయి. దీంతో డయాబెటిస్ నియంత్ర‌ణ‌లో ఉంటుంది.
 
అలాగే నేరేడు పండ్లు కూడా డ‌యాబెటిస్‌ను అదుపు చేస్తాయి. నేరేడు పండ్లను తిన‌డం లేదా.. ఆ పండ్ల‌లో ఉండే విత్త‌నాలను ఎండ‌బెట్టి త‌యారు చేసుకున్న పొడిని నిత్యం తీసుకోవ‌డం వ‌ల్ల కూడా ర‌క్తంలో ఉండే గ్లూకోజ్ స్థాయిలు త‌గ్గుతాయి. డ‌యాబెటిస్ అదుపులో ఉంటుంది.
 
పైనాపిల్‌, దానిమ్మ పండ్లు, ఉసిరి కాయ ర‌సం, బొప్పాయి పండ్లు కూడా డ‌యాబెటిస్‌ను నియంత్రించేందుకు అద్భుతంగా ప‌నికొస్తాయి. వీటిని నిత్యం ఆహారంలో భాగం చేసుకోవ‌డం వ‌ల్ల కేవ‌లం డ‌యాబెటిస్ త‌గ్గ‌డ‌మే కాదు, ప‌లు ముఖ్య‌మైన పోష‌కాలు కూడా మ‌న‌కు ల‌భిస్తాయని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు.