1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. అంతర్జాతీయ వార్తలు
  4. 13 student killed in China school dormitory fire

చైనా స్కూలులో మంటలు.. 13మంది సజీవ దహనం

fire accident
చైనాలోని హెనాన్ ప్రావిన్స్ స్కూలుకు చెందిన వసతి గృహంలో జరిగిన అగ్ని ప్రమాదంలో 13మంది విద్యార్థులు సజీవ దహనం అయ్యారు. ఈ ఘటన శుక్రవారం అర్థరాత్రి చోటుచేసుకుంది. యన్షాన్పు గ్రామంలోని యింగ్‌కై స్కూల్‌లో ఈ ఘోరం చోటుచేసుకుంది. 
 
ఈ ఘటనపై సమాచారం అందుకున్న పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది వెంటనే స్కూలుకు చేరుకుని మంటల్ని అదుపులోకి తీసుకున్నారు. 
 
మంటల్లో చిక్కుకున్న 13 మంది విద్యార్థులు మృతి చెందగా మరొకరు తీవ్రంగా గాయపడ్డారు. ప్రమాదానికి గల కారణాలపై అధికారులు దర్యాప్తు ప్రారంభించారు. 
About Writer
సెల్వి
తర్వాతి కథనం
తెలంగాణ ప్రజలారా... ఇకపై మీరు కరెంటు బిల్లులు కట్టవద్దు: కేటీఆర్ పిలుపు