1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలంగాణ
  4. TSPSC debars another 13 students permanently

టీఎస్ పీఎస్సీ ప్రశ్నపత్రం లీకేజీ కేసు : 13 మంది శాశ్వతంగా డీబార్

tspsc logo
తెలంగాణ స్టేట్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (టీఎస్ పీఎస్సీ) ప్రశ్నపత్రం లీకేజీ వ్యవహారం సంచలనంగా మారిన విషయం తెల్సిందే. ఈ ప్రశ్నపత్రం లీకేజీతో సంబంధం ఉన్న 13 మందిని శాశ్వతంగా డీబార్ చేశారు. భవిష్యత్‌లో వీరు ఎలాంటి పరీక్షలకు హాజరుకాకుండా ఉండేందుకు, ఉద్యోగాలు పొందకుండా తెలంగాణ ప్రభుత్వం చర్యలు తీసుకుంది. ఈ మేరకు శాశ్వతంగా డీబార్ చేసిన వారి పేర్లతో కూడిన జాబితాను టీఎస్ పీఎస్సీ కార్యదర్శి విడుదల చేశారు. ఈ 13 మందితో కలిసి ఇప్పటివరకు డీబార్ అయిన వారి సంఖ్య 50కి చేరింది. 
 
భవిష్యత్‌తో టీఎస్ పీఎస్సీ నిర్వహించే ఏ పరీక్షలకు వీరు హాజరుకాకుండా, ఉద్యోగాలు పొందకుండా చర్యలు తీసుకుంది. ఈ జాబితాను టీఎస్ పీఎస్సీ కార్యదర్శి అనితా రామచంద్రన్ విడుదల చేశారు. ప్రశ్నపత్రాల లీకేజీ కేసులో ప్రమేయం ఉన్న 37 మందిని మంగళవారం శాశ్వతంగా డీబార్ చేయగా, తాజాగా మరో 13 మందిని డీబార్ చేస్తూ ఉత్తర్వులు జారీచేశారు. 
About Writer
ఠాగూర్
తర్వాతి కథనం
వాణిజ్య సిలిండర్ వినియోగదారులకు ఊరట..