శుక్రవారం, 26 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. అంతర్జాతీయ వార్తలు
Written By కుమార్
Last Updated : గురువారం, 14 మార్చి 2019 (17:08 IST)

ఐరాసలో భారత్‌కు మా పూర్తి సహకారం : అమెరికా

జైష్ ఏ మహ్మద్ అధినేత మసూద్ అజార్‌ను అంతర్జాతీయ ఉగ్రవాదిగా ప్రకటించాలని భారత తీర్మానాన్ని చైనా నాలుగోసారి కూడా వ్యతిరేకించడంతో అమెరికా మండిపడుతోంది. మసూద్ అజార్‌ను తప్పనిసరిగా అంతర్జాతీయ ఉగ్రవాదిగా ప్రకటించి తీరాల్సిందేనని అమెరికా స్పష్టం చేసింది.


అలా ప్రకటించని పక్షంలో ప్రపంచవ్యాప్తంగా అనేక దేశాల్లో శాంతికి భంగం వాటిల్లుతుందని అభిప్రాయపడింది. బుధవారం నాడు ఐక్యరాజ్యసమితి భద్రతామండలిలో ముఖ్యమైన సమావేశం జరగనున్న నేపథ్యంలో అమెరికా ఈ వ్యాఖ్యలు చేసింది.
 
మసూద్‌ను అంతర్జాతీయ ఉగ్రవాదిగా ప్రకటించేందుకు అవసరమైన అన్ని సాక్ష్యాలు ఉన్నాయని అమెరికా విదేశాంగ శాఖ ఉప అధికార ప్రతినిధి రాబర్ట్ పల్లాడినో పేర్కొన్నారు. జైషే మహ్మద్ అనేక ఉగ్ర దాడులకు పాల్పడిందని, ఆ దాడుల వల్ల అనేక మంది ప్రజలు ప్రాణాలు కోల్పోయారని పేర్కొన్నారు.

ఉగ్రవాదంపై భారత్‌తో కలిసి పోరాడే విషయంలో ఎటువంటి రాజీ ఉండబోదని స్పష్టం చేసారు. ఐక్యరాజ్యసమితిలో కూడా భారత్‌తు తమ సంపూర్ణ సహకారం ఉంటుందని పేర్కొన్నారు. మసూద్‌ను అంతర్జాతీయ ఉగ్రవాదిగా ప్రకటించాలని అమెరికా ఇప్పటికి 3 సార్లు ప్రతిపాందించగా చైనా ప్రతిసారీ ఈ విషయంలో అడ్డు తగులుతూ వచ్చింది. ఈ విషయంపై స్పందించిన పల్లాడినో శాంతి స్థాపనకు అమెరికా, చైనా కలిసి పని చేస్తాయన్నారు.