1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. అంతర్జాతీయ వార్తలు
  4. Cong leader Khushbu Sundar expresses support for NEP 2020

కొత్త విద్యా విధానం బాగుంది .. నేను రోబోను కాదు : ఖుష్బూ

Khushbu
ప్రధానమంత్రి నరేంద్ర మోడీ సారథ్యంలోని బీజేపీ కేంద్ర ప్రభుత్వం కొత్త జాతీయ విద్యా విధానాన్ని ప్రవేశపెట్టింది. నూతన జాతీయ విద్యా విధానం 2020కి కేంద్ర మంత్రిమండలి ఆమోదముద్ర వేసింది. ఈ విద్యావిధానాన్ని ప్రతి ఒక్కరూ స్వాగతిస్తున్నారు. అలాగే, తమిళనాడు రాష్ట్రానికి చెందిన కాంగ్రెస్ నేత, సినీ నటి ఖుష్బూ కూడా స్వాగతించారు. దీనిపై విమర్శలు వచ్చాయి. దీంతో ఆమె వివరణ ఇచ్చారు. ఇది కేవలం తన వ్యక్తిగత అభిప్రాయమని, పార్టీకి ఏమాత్రం సంబంధం లేదని ఆమె స్పష్టం చేశారు.
 
'నూతన విద్యా విధానంపై పార్టీ విధానంతో నేను పూర్తిగా విభేదిస్తున్నాను. ఇందుకు రాహుల్ గాంధీ గారూ... నన్ను క్షమించాలి. నేను ఉన్నది ఉన్నట్లు మాట్లాడతా. నేను రోబోను కాను. కీలు బొమ్మను అసలే కాను. ప్రతి విషయంలోనూ అధిష్టానానికి తలూపాల్సిన పని లేదు. ఓ సాధారణ పౌరురాలిగా మన వైఖరి చాలా ధైర్యంతో చెప్పాలి' అంటూ ఆమె వ్యాఖ్యానించారు. ప్రస్తుతం ఖుష్బూ వ్యాఖ్యలు తమిళనాడు కాంగ్రెస్ పార్టీలో కలకలం రేపాయి. 
About Writer
ఠాగూర్
తర్వాతి కథనం
అమెరికాలో అధ్యక్ష ఎన్నికలు వాయిదా వేయాలి, ట్రంప్ ప్రకటన