సంబంధిత వార్తలు
- తెలంగాణలో కరోనా వైరస్ విజృంభణ.. కాంగ్రెస్ నేత నరేంద్ర యాదవ్ మృతి
- బెంగాలీ నటి కోయల్ మల్లిక్తో పాటు మొత్తం కుటుంబానికి కరోనా!
- నేను సేఫ్.. ఆందోళన వద్దు - ఎపిఐఐసి ఛైర్ పర్సన్ రోజా
- ఇంటికే కరోనా కిట్, తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం
- కరోనా పుణ్యం.. ఇళ్ల కొనుగోలు 67 శాతానికి పడిపోయింది.. రియల్ ఎస్టేట్ కుదేలు
తెలంగాణలో కరోనా విజృంభణ.. కాంగ్రెస్ నేత జి. నరేందర్ యాదవ్ మృతి
తెలంగాణలో కరోనా వైరస్ విజృంభిస్తోంది. అనేక మంది ప్రజాప్రతినిధులకు కరోనా కాటేస్తోంది. ఇప్పటికే రాష్ట్ర వ్యాప్తంగా 356 మంది చనిపోయారని ప్రభుత్వం అధికారికంగా ప్రకటించింది. తాజాగా హైదరాబాద్కు చెందిన కాంగ్రెస్ నేత జి. నరేందర్ యాదవ్ కరోనాతో మృతి చెందారు. ఆయన మృతితో కుటుంబసభ్యులు, అనుచరులు తీవ్ర విచారంలో ఉన్నారు.
తెలంగాణాలోని జూరాలకు ఇటీవలే కరోనా బారిన పడ్డ రోగులకు సహాయ కార్యక్రమాల్లో ఆయన పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలోనే ఆయన కరోనా సోకింది. దీంతో యశోద ఆస్పత్రిలో వైద్యం తీసుకుంటున్న ఆయన సోమవారం ఉదయం కన్నుమూశారు.
ఇటీవల గాంధీ భవన్లో జరిగిన కార్యక్రమాల్లో కూడా నరేందర్ పాల్గొన్నారు. దీంతో నరేందర్ ఎవరెవరితో కాంటాక్ట్ అయ్యారో వారికి కూడా టెస్టులు చేస్తున్నారు వైద్యులు. కాగా నరేందర్ మృతికి పలువురు కాంగ్రెస్ నాయకులు సంతాపం వ్యక్తం చేశారు. కాగా తెలంగాణలో ఆదివారం 1,269 పాజిటివ్ కేసులు నమోదు అయ్యాయి. కరోనాతో సోమవారం ఎనిమిద మంది చనిపోయారు.
తర్వాతి కథనం
