మంగళవారం, 17 సెప్టెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. అంతర్జాతీయ వార్తలు
Written By ఠాగూర్
Last Updated : శనివారం, 9 అక్టోబరు 2021 (15:24 IST)

తూర్పు కాంగోలో మళ్లీ బయటపడిన ఎబోలా కేసు

తూర్పు కాంగో దేశంలో మళ్లీ ఎబోలా కేసు ఒకటి నమోదైంది. ఆ రాష్ట్ర వైద్య శాఖామంత్రి శుక్రవారం ఈ విషయాన్ని వెల్లడించారు. గత ఐదు నెలల తర్వాత ఈ కేసు నమోదైంది. ఈ ఎబోలా వైరస్ కారణంగా గత 2018-20 మధ్య కాలంలో తూర్పు కాంగోలో 2,200 మందికి పైగా మరణించారు. ఈ యేడాది ఈ వైరస్ ధాటికి ఇప్పటికే కొందరు చనిపోయారు. 
 
2018-2020 వ్యాప్తికి కేంద్రబిందువులలో ఒకటైన తూర్పు నగరం బెని సమీపంలో 3 ఏళ్ల బాలుడు పాజిటివ్‌గా పరీక్షించబడ్డాడు. ఈ బాలుడు ఈ వ్యాధితో మరణించినట్లు ఆరోగ్య మంత్రి జీన్ జాక్వ్స్ మ్బుంగాని ఒక ప్రకటనలో తెలిపారు.
 
అలాగే, ఎబోలా వైరస్ బారినపడిన మరో వంద మందిని వైద్యశాఖ అధికారులు గుర్తించారు. వీరిలో కనిపించే లక్షణాలపై శాస్త్రవేత్తలు ఆరా తీస్తున్నారు. 
 
కాంగో యొక్క బయోమెడికల్ లాబొరేటరీ నుండి వచ్చిన అంతర్గత నివేదిక ప్రకారం, బెని యొక్క జనసాంద్రత కలిగిన బుట్సిలి పరిసరాల్లోని పసిపిల్లల పొరుగువారిలో ముగ్గురు కూడా గత నెలలో ఎబోలాకు సంబంధించిన లక్షణాలను కనిపిస్తున్నాయి. కానీ ఈ ప్రాంత వాసులు ఎబోలా వైరస్ పెద్దగా అవగాహన లేకపోవడంతో పెద్దగా పట్టించుకోవడం లేదు.