1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. అంతర్జాతీయ వార్తలు
Written By ఠాగూర్

నెత్తురోడిన ఇథియోపియా - 230 మంది ఊచకోత

deadbody
ఇథియోపియా దేశంలో మరోమారు నెత్తురోడింది. ఈ దేశం జాతుల మధ్య చెలరేగిన ఘర్షణలతో అట్టుడికిపోయింది. ఈ ఘర్షణలో వివిధ జాతుల ప్రజలు ఒకరినొకరు ఊచకోత కోసుకున్నారు. దీంతో ఏకంగా 230 మంది ప్రాణాలు కోల్పోయారు. అమ్హారా తెగకు చెందిన 200 మందికి పైగా చనిపోయినట్టు సమాచారం. 
 
దేశంలోని ఒరోమియా రీజియన్‌లో ఈ ఘర్షణలు చోటుచేసుకున్నాయి. ఈ నరమేధానికి ఓ తిరుగుబాటు సంస్థే కారణమన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఆఫ్రికాలోనే అత్యంత ఎక్కువ జనాభా గల రెండో దేశమైన ఇథియోపియాలో ఇటీవలి కాలంలో జాతుల ఘర్షణలు పెరిగాయి. 
 
తాజా మారణ హోమానికి ఒరోమో లిబరేషన్‌ ఆర్మీ(వోఎల్‌ఏ)దే బాధ్యత అని ఇద్దరు ప్రత్యక్ష సాక్షులూ ఆరోపించారు. ఈ ఆరోపణలను వోఎల్‌ఏ అధికార ప్రతినిధి ఒడ్డా తర్బీ ఖండించారు.