శుక్రవారం, 19 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. ఐటీ
  3. ఐటీ వార్తలు
Written By సెల్వి
Last Updated : మంగళవారం, 22 డిశెంబరు 2020 (18:15 IST)

ప్రతీ సెకనుకు ఒక చికెన్ బిర్యానీ ఆర్డర్.. స్విగ్గీ ప్రకటన

హైదరాబాద్ బిర్యానీకి పెట్టింది పేరు. చికెన్ బిర్యానీ చాలామంది ఎంతో ఇష్టపడే ఆహారం. ప్రస్తుతం దీని విక్రయాలు కూడా రికార్డును సృష్టిస్తున్నాయి. ఎలాగంటే.. 2020లో ప్రతీ వెజ్ బిర్యానీకి, ఆరు చికెన్ బిర్యానీ ఆర్డర్లు నమోదయ్యాయి. ఆన్‌లైన్ డెలివరీ ప్లాట్‌ఫామ్ 'స్విగ్గి ఈ మంగళవారం తన వార్షిక విశ్లేషణ వివరాలను వెల్లడించింది.
 
కరోనా మహమ్మారి కోరలు చాపిన గత కొద్ది నెలలుగా... వినియోగదారులు ఎక్కువగా కాంటాక్ట్‌లెస్ ఫుడ్ విధానానికి అలవాటుపడిన విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే... ప్రతీ సెకనుకు ఒకటి కంటే ఎక్కువ బిర్యానీలు ఆర్డర్లు అయినట్లుగా తెలిపింది. కాగా 2020 లో ఇంటి వంటకాలే అత్యంత ఫెర్రీ ఐటంగా నిలిచినట్లు వెల్లడించింది.  
 
స్విగ్గీకి కొత్తగా లాగిన్ అయిన మూడు లక్షలకు పైగా నూతన వినియోగదారులు తమ తొలి ఆహారంగా చికెన్ బిర్యానీని ఆర్డర్ చేశారు. ఇక లాక్‌డౌన్ అనంతరం 20 లక్షల పానీ పూరి ప్యాక్స్‌ను డెలివరీ అయ్యాయి. హెల్త్ ఫుడ్ ఐట్సెం పేరుతో స్విగ్గి హెల్త్‌ హబ్‌‌ను మొన్నటి ఆగస్టులో ప్రారంభించిన సంగతి తెలిసిందే. స్విగ్గి హెల్త్‌హబ్‌‌లో ఆరోగ్యకరమైన ఆహారాల కోసం ఆర్డర్లు ఇవ్వడంలో 130 శాతం పెరుగుదల నమోదయ్యాయి.