1. వార్తలు
  2. బిజినెస్
  3. వార్తలు
Written By సెల్వి
Last Updated : గురువారం, 17 డిశెంబరు 2020 (16:50 IST)

డొమినోస్ నుంచి పిజ్జాలే కాదు.. ఇక రూ.99లకే దమ్ బిర్యానీ!!

డొమినోస్ పిజ్జాలను తయారు చేసే సంస్థ జుబిలెంట్ ఫుడ్‌వర్క్స్ లిమిటెడ్ (జేఎఫ్ఎల్‌) ఇక బిర్యానీ మార్కెట్‌లోకీ అడుగుపెట్టనుంది. ఏక్‌దమ్ పేరుతో కొత్త బ్రాండ్ బిర్యానీని తీసుకొస్తోంది.

బిర్యానీతోపాటు కబాబ్‌లు, కూరలు, బ్రెడ్స్‌, రైతాలు, చట్నీలు, డెజర్ట్‌లు కూడా తీసుకురావాలని జేఎఫ్ఎల్ నిర్ణయించింది. అంతేకాదు.. ఏక్‌దమ్ బిర్యానీ కేవలం రూ.99 నుంచే అందుబాటులో ఉంటుందని కూడా సంస్థ ప్రకటించింది.
 
ఈ బ్రాండ్ కింద ఏకంగా 20 రకాల బిర్యానీ రుచులను అందించనుంది. అందులో మన హైదరాబాదీ నిజామీ బిర్యానీ, లక్నవీ నవాబీ బిర్యానీ, కోల్‌కతా బిర్యానీ, బటర్ చికెన్ బిర్యానీలాంటివి ఉన్నాయి.

ప్రస్తుతానికి గురుగ్రామ్‌లోని మూడు రెస్టారెంట్లలో ఈ బిర్యానీని అందుబాటులోకి తీసుకొచ్చిన జేఎఫ్ఎల్‌.. రానున్న రోజుల్లో దేశవ్యాప్తంగా తమ బిర్యానీ రుచులను అందించనుంది.