శుక్రవారం, 29 మార్చి 2024
  1. వార్తలు
  2. ఐటీ
  3. ఐటీ వార్తలు
Written By ఠాగూర్
Last Updated : సోమవారం, 25 మే 2020 (16:26 IST)

అడగగానే అన్నీ విప్పి చూపించొద్దు .. స్నేహాలపై ఆన్​లైన్​ స్నేహాలపై సీబీఎస్​ఈ

కరోనా లాక్డౌన్ వేళ ప్రతి ఒక్కరూ ఆన్‌లైన్ వినియోగం, కార్యకలాపాలపై మొగ్గు చూపుతున్నారు. ముఖ్యంగా, ఈ విషయంలో యువత ముందంజలో ఉంది. అయితే, ఈ ఆన్‌లైన్ వినియోగంతో ఎన్ని ప్రయోజనాలు ఉన్నాయో.. అంతే ముప్పూ ఉంది. ముఖ్యంగా, సైబర్ నేరగాళ్లు పెట్రేగిపోతున్నారు. 
 
ఈ సందర్భంగా వర్చువల్​ ప్రపంచంలో యువత తమ భద్రత కోసం సెంట్రల్​ బోర్డ్​ ఆఫ్​ సెకండరీ ఎడ్యుకేషన్​ (సీబీఎస్​ఈ) హ్యాండ్​ బుక్​ విడుదల చేసింది. ద్వేషపూరిత అశ్లీలత, ఆన్​లైన్​ స్నేహాల్లో పరిమితులు విధించుకోవటం, ఆన్​లైన్​లో ఏదైనా సమస్య ఎదుర్కొంటే పెద్దలకు తెలపటం వంటివి ముఖ్యమైన అంశాలుగా అందులో పేర్కొన్నారు. 
 
లాక్డౌన్​తో బోధనా కార్యక్రమాలు పూర్తిగా ఆన్​లైన్​లోకి వెళ్తోన్న క్రమంలో.. విద్యార్థులు డిజిటల్​ ప్రపంచానికి చేరువవుతున్నారు. ఇటీవల బయటపడిన 'బోయిస్​ లాకర్​ రూమ్'​ గ్రూప్​ కేసు వల్ల ఆన్​లైన్​ బెదిరింపుల ఆందోళనలూ పెరిగాయి. ఈ నేపథ్యంలో ఆన్​లైన్​ ప్రపంచంలో యువత తమ భద్రతను నిర్ధరించుకోవటానికి పలు మార్గదర్శకాలను సీబీఎస్ఈ విడుదల చేసింది. 
 
ద్వేషపూరిత అశ్లీలత (రివేంజ్​ పోర్నోగ్రఫీ), ఆన్​లైన్​ స్నేహాల్లో పరిమితులు విధించుకోవటం, స్నేహితులను అంచనా వేయటం, సమస్యలు ఎదుర్కొన్నప్పుడు పెద్దలకు తెలపటం వంటివి సీబీఎస్​ఈ విడుదల చేసిన పాఠాల్లోని ముఖ్యమైన అంశాలు. 9-12వ తరగతుల విద్యార్థుల కోసం సైబర్​ భద్రత హ్యాండ్​బుక్​ను విడుదల చేసింది సీబీఎస్​ఈ. ఇందులో విద్యార్థులతో పాటు తల్లిదండ్రులకు సైబర్​ నేరాల విషయంలో ఏమి చేయాలి? ఏమి చేయకూడదు అనేది ప్రస్తావించింది.