మంగళవారం, 30 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. ఐటీ
  3. ఐటీ వార్తలు
Written By సెల్వి
Last Updated : మంగళవారం, 8 సెప్టెంబరు 2020 (16:26 IST)

హువావే కంపెనీ నుంచి మేట్‌ప్యాడ్ టి8-ఫ్లిప్ కార్ట్‌లో సేల్

హువావే కంపెనీ నుంచి మేట్‌ప్యాడ్ టి8 పేరిట నూతన ఆండ్రాయిడ్ ట్యాబ్లెట్‌ భారత్‌లో విడుదలైంది.  ఈ ట్యాబ్‌ను సెప్టెంబర్ 14 నుంచి ఫ్లిప్ కార్ట్‌లో విక్రయిస్తారు. ఇందులో 8 ఇంచుల హెచ్‌డీ ప్లస్ రిజల్యూషన్ కలిగిన డిస్‌ప్లేను ఏర్పాటు చేశారు. 
 
MatePad T8
ఆక్టాకోర్ మీడియాటెక్ ఎంటీ8768 ప్రాసెసర్‌ను అమర్చారు. 2జీబీ ర్యామ్‌ను ఏర్పాటు చేశారు. వెనుక, ముందు 5, 2 మెగాపిక్సల్ కెమెరాలు ఉన్నాయి. ఆండ్రాయిడ్ 10 ఓఎస్‌ను ఇందులో అందిస్తున్నారు. 5100 ఎంఏహెచ్ బ్యాటరీ ఇందులో ఉంది.
 
హువావే మేట్ ప్యాడ్ టి8 ఆండ్రాయిడ్ ట్యాబ్లెట్ డీప్ సీ బ్లూ కలర్ ఆప్షన్‌లో విడుదలైంది. ఈ ట్యాబ్లెట్‌కు చెందిన వైఫై వేరియెంట్ ధర రూ.9,999 ఉండగా, ఎల్‌టీఈ వేరియెంట్ ధర రూ.10,999గా ఉంది.
 
హువావే మేట్ ప్యాడ్ టి8 స్పెసిఫికేషన్లు…
* 512 జీబీ ఎక్స్‌పాండబుల్ స్టోరేజ్, ఆండ్రాయిడ్ 10 ఓఎస్
* 5, 2 మెగాపిక్సల్ బ్యాక్‌, ఫ్రంట్ కెమెరాలు, ఎల్‌టీఈ సపోర్ట్‌, డ్యుయల్ బ్యాండ్ వైఫై
* బ్లూటూత్ 5.0 ఎల్ఈ, జీపీఎస్‌, మైక్రో యూఎస్‌బీ, 3.5 ఎంఎం జాక్
 
* 5100 ఎంఏహెచ్ బ్యాటరీ, ఫాస్ట్ చార్జింగ్
* 8 ఇంచుల హెచ్‌డీ ప్లస్ ఎల్‌సీడీ డిస్‌ప్లే, 1280 x 800 పిక్సల్స్ స్క్రీన్ రిజల్యూషన్
* ఆక్టాకోర్ మీడియాటెక్ ఎంటీ8768 ప్రాసెసర్‌, 2జీబీ ర్యామ్‌, 32 జీబీ స్టోరేజ్