ఆదివారం, 28 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. ఐటీ
  3. ఐటీ వార్తలు
Written By ఠాగూర్
Last Updated : మంగళవారం, 19 జులై 2022 (10:33 IST)

రూ.పాతిక వేలకే నాజూకైన ల్యాప్‌టాప్ - 21 నుంచి విక్రయాలు

inbox laptop
ఇన్ఫినిక్స్ ఇండియా అనేక కంపెనీ పాతిక వేల రూపాయలకే ఇన్‌బాక్స్ ఎక్స్1 అనే పేరుతో ఓ ల్యాప్‌‍టాప్‌ను అందుబాటులోకి తెచ్చింది. బడ్జెట్ ధరతో రూపొందించిన ఈ ల్యాప్ టాప్ విక్రయాలు ఈ నెల 21వ తేదీ నుంచి ప్రారంభంకానున్నాయి. ఫ్లిప్ కార్ట్‌లో మాత్రమే విక్రయించే ఈ ల్యాప్ టాప్‌లు రెండు రంగుల్లో లభ్యంకానుంది. 8 జీబీ ర్యామ్, 256 జీబీ స్టోరేజ్‌ సామరథ్యంతో రూపొందించారు. 
 
ఫాస్ట్ చార్జింగ్‌కు అనుకూలంగా కూడా ఉంటుందని ఆ తయారీ సంస్థ ప్రకటించింది. ఈ ల్యాప్ టాప్ బరువు కేజీ 24 గ్రాములు. 14.8 ఎంఎం మందంతో నాజూకుగా ఉంటుంది. ఇంటెల్ సెల్ రాన్ క్యాడ్ కోర్ ఎన్ఎస్ 5100 ప్రాసెసర్‌తో పని చేస్తుందని 8జీబీ ర్యామ్, 256 జీబీ స్టోరేజీతో తయారు చేసినట్టు తెలిపింది. 
 
ముఖ్యంగా విద్యార్థులకు టాస్క్‌లకు ఈ ల్యాప్ టాప్ సాఫీగా పనిచేస్తుందని కంపెనీ తెలిపింది. అల్యూమినియం ఆధారిత మెటల్ బాడీతో దీన్ని తయారు చేశారు. కాస్మిక్ బ్లూ, స్టాల్ ఫాల్ గ్రే రగుల్లో లభ్యంకానుంది. సిటీ, ఆర్బీఎల్, కోటక్, యాక్సెస్ బ్యాంకు కార్డులతో ఈ ల్యాప్ టాప్‌ను కొనుగోలు చేస్తే మాత్రం మరింత ధర తగ్గుతుది. ప్రధానంగా విద్యార్థులను దృష్టిలో ఉంచుకుని దీన్ని తయారు చేశారు.