1. వార్తలు
  2. ఐటీ
  3. ఐటీ వార్తలు
Written By సెల్వి
Last Updated : మంగళవారం, 28 ఫిబ్రవరి 2023 (13:24 IST)

200 మంది ఉద్యోగులను తొలగించిన ట్విట్టర్

Twitter
ప్రపంచంలోని అత్యంత సంపన్నులలో ఒకరైన ఎలాన్ మస్క్ గత ఏడాది అక్టోబర్‌లో ప్రముఖ సోషల్ నెట్‌వర్కింగ్ సైట్ ట్విట్టర్‌ను కొనుగోలు చేశారు. ఎలోన్ మస్క్ ట్విటర్‌ను స్వాధీనం చేసుకున్నప్పుడు దాని నిర్వహణలో అనేక తీవ్రమైన మార్పులు తీసుకువచ్చారు. 
 
ఇందులో భాగంగా.. ట్విట్టర్ మొత్తం 7,500 మంది ఉద్యోగులలో 4,000 కంటే ఎక్కువ మందిని తొలగించారు. అలాగే, ఎలోన్ మస్క్ పొదుపు చర్యల కారణంగా వందలాది మంది ట్విట్టర్ ఉద్యోగులు రాజీనామా చేశారు. 
 
అప్పటి నుండి ట్విట్టర్ చిన్నపాటి తొలగింపులను కొనసాగిస్తూనే ఉంది. దీంతో ట్విట్టర్ ఉద్యోగుల సంఖ్య 2 వేలకు తగ్గింది. ఈ పరిస్థితిలో, మరో 200 మంది ఉద్యోగులను ట్విట్టర్ నుండి తొలగించారు. అంటే ట్విట్టర్ తన మొత్తం వర్క్‌ఫోర్స్‌లో 10 శాతం మందిని తొలగించింది. దీంతో మొత్తం ట్విట్టర్ ఉద్యోగుల సంఖ్య 1,800కి తగ్గింది.