శనివారం, 20 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. ఐటీ
  3. ఐటీ వార్తలు
Written By వరుణ్
Last Updated : బుధవారం, 16 నవంబరు 2022 (10:28 IST)

వాట్సాప్ - మెటాలకు షాక్.. కీలక విభాగాధిపతులు రాజీనామా

whatsapp
సోషల్ మీడియా సంస్థలకు తేరుకోలేని షాకులు తగులుతున్నాయి. ప్రపంచ కుబేరుడు ఎలాన్ మస్క్ ట్విట్టర్‌ను కొనుగోలు చేసిన తర్వాత ఆ సంస్థలో సంచలన మార్పులకు శ్రీకారం చుట్టారు. ఇందులోభాగంగా, అనేక మంది టాప్ ఎగిక్యూటివ్స్‌తో పాటు కిందిస్థాయి ఉద్యోగులను తొలగించారు. 
 
ఈ నేపథ్యంలో వాట్సాప్, ఫేస్‌బుక్ మాతృసంస్థ మెటాలకు ఎదురు దెబ్బ తగిలింది. వాట్సాప్ ఇండియా అధిపతి అభిజిత్ బోస్, మెటా పబ్లిక్ పాలసీ విభాగాధిపతి అభిజిత్ బోస్, మెటా పబ్లిక్ పాలసీ విభాగం హెడ్ రాజీవ్ అగర్వాల్‌లు తమతమ పదవులకు రాజీనామా చేశారు. ఈ మేరకు సామాజిక మాద్యమ దిగ్గజం మెటా సంస్థ తెలిపింది.
 
మెటాలో ప్రపంచ వ్యాప్తంగా 11 వేల మంది ఉద్యోగులకు లే-ఆఫ్ ప్రకటించిన తర్వాత ఈ పరిణామం చోటుచేసుకోవడం గమనార్హం. అలాగే, భారత్‌లో వాట్సాప్ పబ్లిక్ పాలసీ డైరెక్టరుగా కొనసాగుతున్న శివ్‌నాథ్ థుక్రాల్‌కు మెటా ఇండియా పాలసీ విభాగ బాధ్యతలు అప్పగించింది. 
 
భారత్‌లో వాట్సాప్‌కు తొలి హెడ్‌గా మంచి సేవలు అందించిన అభిజిత్ బోస్‌కు కృతజ్ఞతలు తెలుపుతున్నా. అతని ఆధ్వర్యంలో సరికొత్త సేవలను కోట్ల మందికి, వ్యాపారులకు అందించగలిగాం. భారత్‌కు వాట్సాప్ మరిన్ని సేవలను అందిస్తుందని వాట్సాప్ హెడ్ విల్ కాథ్‌కార్ట్ వెల్లడించారు. 
 
కాగా, 2019 ఫిబ్రవరిలో బోస్ వాట్సాప్ తొలి కంట్రీ హెడ్‌గా బాధ్యతలు స్వీకరించారు. వాట్సాప్ అన్ని బృందాలకు వారం రోజులుగా కష్ట సమయం నడుస్తుందని బోస్ సామాజిక మాధ్య పోస్ట్ ద్వారా తెలిపారు. కొంత విరామం తర్వాత ఎంటర్‌ప్రెన్యూరియల్ వరల్డ్‌లో చేరుతానని ఆయన తెలిపారు.