1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By సెల్వి
Last Updated : సోమవారం, 3 ఏప్రియల్ 2023 (11:38 IST)

జలుబు, జ్వరాలకు విక్రయించే 59 మందులు నాసిరకం

tablets
జలుబు, జ్వరాలకు విక్రయించే 59 రకాల మందులు నాణ్యత లేనివని కేంద్ర ఔషధ నియంత్రణ మండలి తెలియజేసింది. కేంద్ర- రాష్ట్ర ఔషధ నాణ్యత నియంత్రణ బోర్డులు భారతదేశం అంతటా విక్రయించే ఫార్మాస్యూటికల్ మాత్రలపై నాణ్యత నియంత్రణ తనిఖీలను నిర్వహిస్తున్నాయి. 
 
ఈ తనిఖీల్లో నకిలీ లేదా నాసిరకం మందులు దొరికితే సంబంధిత కంపెనీలపై కఠిన చర్యలు తీసుకుంటాం. ఈ పరిస్థితిలో గత ఫిబ్రవరిలో 1251 మందులను పరిశీలించగా అందులో 59 మందులు నాసిరకంగా ఉన్నాయని గుర్తించి జలుబు, జ్వరానికి ఇస్తున్నట్లు గుర్తించారు. 
 
ఉత్తరాఖండ్, హిమాచల్ ప్రదేశ్ రాష్ట్రాల్లో ఈ మందులు ఎక్కువగా తయారవుతున్నాయని గుర్తించారు. నాసిరకం మందుల వివరాలను సెంట్రల్‌ డ్రగ్‌ క్వాలిటీ కంట్రోల్‌ బోర్డు వెబ్‌సైట్‌లో ప్రచురించామని, సంబంధిత కంపెనీలపై తగిన చర్యలు తీసుకుంటామని ఔషధ నియంత్రణ మండలి అధికారులు తెలిపారు.