1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By
Last Updated : ఆదివారం, 26 మే 2019 (16:17 IST)

ఇది నిజంగానే చారిత్రక విజయం : బీజేపీ గెలుపు అద్వానీ

సార్వత్రిక ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ సాధించిన విజయంపై ఆ పార్టీ సీనియర్ నేత, ఎల్కే. అద్వానీ స్పందించారు. ఢిల్లీలోని పార్లమెంటు సెంట్రల్ హాల్‌లో జరిగిన బీజేపీ పార్లమెంటరీ సమావేశంలో పాల్గొన్న అద్వానీ తన సంతోషాన్ని మీడియాతో పంచుకున్నారు. 
 
ఈ సందర్భంగా ఎల్కే.అద్వానీ స్పందిస్తూ, లోక్‌సభ ఎన్నికల్లో బీజేపీ సాధించిన ఫలితాలు చాలా సంతోషంగా ఉన్నాయన్నారు. ఇది నిజంగా చారిత్రక విజయమని అభివర్ణించారు. ఈ ఎన్నికల్లో దేశ ప్రజలు చారిత్రాత్మక రీతిలో బీజేపీకి, దాని మిత్రపక్షాలకు మద్దతు ఇచ్చారన్నారు. ప్రజల తీర్పు పట్ల ఎన్డీయేలోని ప్రతి ఒక్కరూ ఆనందిస్తున్నారన్నారు. 
 
కాగా, ఎన్నికల్లో ఘనవిజయం సాధించిన అనంతరం, నరేంద్ర మోడీ నేరుగా అద్వానీ ఇంటికి వెళ్లి ఆయనకు పాదాభివందనం చేసి ఆశీస్సులు అందుకోవడం తెలిసిందే. బీజేపీ పార్లమెంటరీ నేత ఎన్నిక కార్యక్రమంలో కూడా ఇదే సీన్ పునరావృతమైంది. మోడీ మరోసారి బీజేపీ కురువృద్ధుడి దీవెనలు అందుకున్నారు.
 
కాగా, ఈ నెల 23వ తేదీన వెల్లడైన ఎన్నికల ఫలితాల్లో బీజేపీకి 303 సీట్లు రాగా, ఎన్డీయే కూటమికి 353 సీట్లు వచ్చాయి. దీంతో ప్రధాని నరేంద్ర మోడీ వరుసగా రెండోసారి ప్రధానిగా ప్రమాణ స్వీకారం చేయనున్నారు.