1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
  4. Three Pakistan Smugglers Arrest

కాశ్మీర్‌లో పాకిస్థాన్ స్మగ్లర్లు అరెస్టు - భారీగా డ్రగ్స్ సీజ్

Kashmir
జమ్మూకాశ్మీర్ రాష్ట్రంలో పాకిస్థాన్‌కు చెందిన ముగ్గురు స్మగ్లర్లను అరెస్టు చేశారు. వీరి నుంచి భారీ మొత్తంలో డ్రగ్స్‌ను సీజ్ ‌చేశారు. ఈ డ్రగ్స్ మొత్తం 36 కేజీల వరకు ఉందని భారత భద్రతా అధికారులు వెల్లడించారు. 
 
కాశ్మీర్ సరిహద్దుల ద్వారా ముగ్గురు పాకిస్థాన్ స్మగ్లర్లు చొరబాటుకు యత్నించగా వారిని భద్రతా బలగాలు గుర్తించి అదుపులోకి తీసుకున్నాయి. ఈ ముగ్గురు నుంచి 36 ప్యాకెట్ల హెరాయిన్‌ను స్వాధీనం చేసుకున్నట్టు బీఎస్ఎఫ్ అధికారులు వెల్లడించారు. భారత్‌లోకి చొరబడుతున్న ముగ్గురిని ఆదివారం తెల్లవారుజామున 2.30 గంటల సమయంలో అదుపులోకి తీసుకున్నట్టు తెలిపారు. 
About Writer
ఠాగూర్
తర్వాతి కథనం
మావోలు అమర్చిన బాంబు పేలి జర్నలిస్టు మృతి