శుక్రవారం, 29 మార్చి 2024
  1. ఆధ్యాత్మికం
  2. భవిష్యవాణి
  3. పంచాంగం
Written By
Last Updated : మంగళవారం, 25 డిశెంబరు 2018 (18:10 IST)

శనివారం మాత్రమే రావిచెట్టును తాకాలట.. ఎందుకో తెలుసా?

కార్తీక మాసంలో ఉసిరి చెట్టు, విజయదశమి రోజున శమీ వృక్షాన్ని పూజించాలి. అలాగే రావి చెట్టును ప్రతి నిత్యం పూజించే వారికి దారిద్ర్యం తొలగిపోతుంది. అందుకే దేవాలయాల్లో వుండే రావిచెట్టుకు భక్తులు నిత్యం ప్రదక్షిణలు చేస్తూ కనిపిస్తుంటారు. 
 
మనసులోని కోరికను చెప్పుకుని రావిచెట్టుకు అనునిత్యం ప్రదక్షిణలు చేసి పూజించాలి. ఇలా చేస్తే కోరిన కోరికలు నెరవేరుతాయని నమ్మకం. సంతానయోగం కలుగుతుంది. రావిచెట్టును ఎప్పుడు పడితే అప్పుడు తాకరాదని పండితులు చెప్తున్నారు. 
 
ఏ రోజున పడితే ఆ రోజు రావిచెట్టును తాకడం వలన దోషం కలుగుతుంది. అందువలన కేవలం శనివారం రోజున మాత్రమే ఈ వృక్షాన్ని తాకడం ద్వారా శుభఫలితాలుంటాయని పండితులు సూచిస్తున్నారు. ఎందుకంటే.. రావిచెట్టు దేవతా వృక్షంగా పరిగణింబడుతోంది. రావిచెట్టు సాక్షాత్తు విష్ణు స్వరూపంగా పూజింపబడుతోంది. అందుకే శనివారం మాత్రమే ఆ చెట్టును తాకాలని పండితులు సూచిస్తున్నారు.