1. ఆధ్యాత్మికం
  2. ఆధ్యాత్మికం వార్తలు
  3. కథనాలు
  4. TTD will Re Start Arjitha Sevas from April 1st at Tirumala

శ్రీవారి భక్తులకు శుభవార్త.. ఏంటది?

TTD
శ్రీవారి వేంకటేశ్వర స్వామి భక్తులకు తిరుమల తిరుపతి దేవస్థానం (తితిదే) బోర్డు శుభవార్త చెప్పింది. కరోనా వైరస్ వ్యాప్తి కారణంగా నిలిచిపోయిన ఆర్జిత సేవలను తిరిగి పునరుద్ధరించేందుకు సమ్మతించింది. ఇందులోభాగంగా ఏప్రిల్ ఒకటో తేదీ నుంచి ఈ సేవలను తిరిగి పునఃప్రారంభిస్తున్నట్టు తితిదే ఓ ప్రకటనలో తెలిపింది. 
 
ముఖ్యంగా శ్రీవారి ఆర్జిత సేవల్లో సుప్రభాతం, తోమాల, అర్చన, అష్టదళపాదపద్మారాధన, తిరుప్పావడ, మేల్ చాట్ వస్త్రం, అభిషేకం, కళ్యాణోత్సవం, డోలోత్సవం, ఆర్జిత బ్రహ్మోత్సవం, సహస్రదీపాలంకార సేవలను తిరిగి ప్రారంభిచనున్నట్టు పేర్కొంది. గతంలో ఉన్న విధానంలోనే ఈ ఆర్జిత సేవలకు టిక్కెట్లు బుక్ చేసుకోవాలని తితిదే కోరింది. 
 
ఇక అడ్వాన్స్ బుకింగ్‌లో ఆర్జిత సేవలను బుక్ చేసుకున్నవారిని ఉదయాస్తమాన సేవ, వింశతి వర్ష దర్శిని సేవలు బుక్ చేసుకున్నవారిని ఏప్రిల్ 1 తేదీ నుంచి కోవిడ్ 19 నిబంధనలు పాటిస్తూ ఆయా సేవలకు అనుమతించనున్నట్టు పేర్కొంది. 
About Writer
ఠాగూర్
తర్వాతి కథనం
10-03-2022 గురువారం రాశిఫలాలు - రాఘవేంద్రస్వామిని పూజించినా సర్వదా శుభం