సంబంధిత వార్తలు
- తిరుమలలో ఫాస్ట్ ఫుడ్ సెంటర్ల పవర్: వెనక్కి తగ్గిన తితిదే ఛైర్మన్
- నేటి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అసెంబ్లీ సమావేశాలు - హైకోర్టు తీర్పుపైనే ప్రధాన చర్చ?
- ఐపీఎల్ షెడ్యూల్ రిలీజ్ : మార్చి 26 నుంచి మెగా లీక్ ప్రారంభం
- శ్రీవారి అర్జిత సేవా టిక్కెట్ల ధరల పెంపుపై వెనక్కి తగ్గిన తితిదే
- తితిదే అర్జిత సేవల ధరల పెంపుపై క్లారిటీ ఇచ్చిన ఛైర్మన్
శ్రీవారి భక్తులకు శుభవార్త.. ఏంటది?
శ్రీవారి వేంకటేశ్వర స్వామి భక్తులకు తిరుమల తిరుపతి దేవస్థానం (తితిదే) బోర్డు శుభవార్త చెప్పింది. కరోనా వైరస్ వ్యాప్తి కారణంగా నిలిచిపోయిన ఆర్జిత సేవలను తిరిగి పునరుద్ధరించేందుకు సమ్మతించింది. ఇందులోభాగంగా ఏప్రిల్ ఒకటో తేదీ నుంచి ఈ సేవలను తిరిగి పునఃప్రారంభిస్తున్నట్టు తితిదే ఓ ప్రకటనలో తెలిపింది.
ముఖ్యంగా శ్రీవారి ఆర్జిత సేవల్లో సుప్రభాతం, తోమాల, అర్చన, అష్టదళపాదపద్మారాధన, తిరుప్పావడ, మేల్ చాట్ వస్త్రం, అభిషేకం, కళ్యాణోత్సవం, డోలోత్సవం, ఆర్జిత బ్రహ్మోత్సవం, సహస్రదీపాలంకార సేవలను తిరిగి ప్రారంభిచనున్నట్టు పేర్కొంది. గతంలో ఉన్న విధానంలోనే ఈ ఆర్జిత సేవలకు టిక్కెట్లు బుక్ చేసుకోవాలని తితిదే కోరింది.
ఇక అడ్వాన్స్ బుకింగ్లో ఆర్జిత సేవలను బుక్ చేసుకున్నవారిని ఉదయాస్తమాన సేవ, వింశతి వర్ష దర్శిని సేవలు బుక్ చేసుకున్నవారిని ఏప్రిల్ 1 తేదీ నుంచి కోవిడ్ 19 నిబంధనలు పాటిస్తూ ఆయా సేవలకు అనుమతించనున్నట్టు పేర్కొంది.
