సంబంధిత వార్తలు
- కేసీఆర్ ఓ బ్రోకర్.. లోఫర్.. మోడీని చూస్తే కేసీఆర్ లాగు తడిసిపోద్ది : ఉత్తమ్
- టీఆర్ఎస్ ఏపీలో, చంద్రబాబు తెలంగాణలో పోటీచేస్తే?: ప్రకాష్ రాజ్
- ఆమరణ దీక్ష చేస్తే గత్యంతరం లేకుండా తెలంగాణ ఇచ్చారు..
- షాకింగ్... తెలంగాణకు మళ్లీ కేసీఆరే సీఎం కావాలంటున్న ఆంధ్రా ప్రజలు, బాబుకి ఇక్కడ షాకిస్తారా?
- రేవంత్ రెడ్డిని గుర్తించిన రాహుల్... హెలికాప్టర్ ఏర్పాటు
తెలంగాణ కేసీఆర్ అండ్ కో జాగిరికాదు... : రేవంత్ రెడ్డి
తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్పై టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డి మరోమారు విమర్శలు గుప్పించారు. తెలంగాణ కేసీఆర్ అండ్ జాగిరి కాదన్నారు. తెలంగాణలో లక్ష ఉద్యోగాలు రావాలంటే కేసీఆర్ ఉద్యోగం పోవాలని తెలంగాణ యువతకు ఆయన పిలుపునిచ్చారు.
రాజన్నసిరిసిల్ల జిల్లాలోని చందుర్తిమండలంలో కాంగ్రెస్ ప్రజా చైతన్య సభలో మాట్లాడుతూ, తెరాస అభ్యర్థి చెన్నమనేని రమేష్ బాబు గెలిచినా, ఓడినా ఆయన జర్మనీలోనే ఉంటారని ఆయన ఎద్దేవా చేశారు. కేవలం సెలవుల్లోనే ఆయన ఇక్కడకు వస్తారని ఆయన విమర్శించారు.
తెలంగాణ ఇచ్చిన దేవత అని సోనియా గాంధీ అని స్వయంగా కేసీఆరే గతంలో చెప్పారని, తెలంగాణ కోసం ప్రాణత్యాగాలు చేసిన 1569 అమరుల కుటుంబాలకు కేసీఆర్ ఏం న్యాయం చేశారని నిలదీశారు. తమ పార్టీ అధికారంలోకి వస్తే 58 ఏళ్లు నిండిన భార్యా భర్తలకు ఒక్కొక్కరికి రూ.2 వేలు చొప్పున పింఛను ఇస్తామని రేవంత్ హామీ ఇచ్చారు.
తర్వాతి కథనం