విశ్రాంతి ఐపీఎస్ భార్య తనూజ హత్య కేసులో పురోగతి.. నేపాల్ గ్యాంగ్ హస్తం
హైదరాబాద్ నగరంలో సంచలనం సృష్టించిన విశ్రాంతి ఐపీఎస్ అధికారి భార్య తనూజ రంజన్ హత్య కేసులో పోలీసులు కీలక పురోగతి సాధించారు. ఈ కేసులో ప్రధాన నిందితురాలిగా ఉన్న నేపాల్ పని మనిషి కల్పన అలియాస్ ధర్మ (30)ను మహారాష్ట్రలోని పూణెలో పోలీసులు అరెస్టు చేశారు. ఆమెను ప్రత్యేక బృందాలు హైదరాబాద్కు తరలిస్తున్నారు.
ఈ కేసును ఛాలెంజ్గా తీసుకున్న పోలీసులు నిందితులు కోసం పలు రాష్ట్రాల్లో ముమ్మరంగా గాలించారు. హైదరాబాద్, పూణె, ముంబై, ఢిల్లీ, బీహార్కు చెందిన ప్రత్యేక బృందాలు పంపించి, నిందితులు దేశ సరిహద్దులు దాటకుండా పక్కాగా చర్యలు చేపట్టారు. ఈ క్రమంలో పట్టుబడిన ఇద్దరు ఇచ్చిన సమాచారం ఆధారంగా పోలీసులు పూణెలో తలదాచుకున్న కల్పనను అదుపులోకి తీసుకున్నారు.
పోలీసుల దర్యాప్తులో ఈ హత్య వెనుక నేపాల్కు చెందిన సాహూ గ్యాంగ్ హస్తం ఉన్నట్టు తేలింది. ఢిల్లీ జైలు నుంచే ఈ దోపిడీకి పథకం రచించినట్టు పోలీసులు గుర్తించారు. ఈ నేరం కోసం ముంబై, నేపాల్, పాట్నా నుంచి వేర్వేరు వ్యక్తులతో ఒక బృందాన్ని ఏర్పాటు చేసినట్టు నిర్ధారించారు. దోపిడీ చేసిన బంగారాన్ని ముంబై నగరంలో దాచిపెట్టినట్టు కూడా పోలీసులు గుర్తించారు. కల్పనను హైదరాబాద్ నగరానికి తీసుకొచ్చి విచారిస్తే ఈ కేసులో మరిన్ని వివరాలు వెలుగులోకి వచ్చే అవకాశం ఉందని పోలీసులు భావిస్తున్నారు.
