1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలంగాణ వార్తలు
  4. Driver Burnt Alive as Lorry Catches Fire in Mahbubnagar

మేకల లోడుతో వెళ్తున్న లారీలో మంటలు.. డ్రైవర్ సజీవ దహనం

Lorry
Lorry
తెలంగాణ మహబూబ్‌నగర్ జిల్లాలో గురువారం తెల్లవారుజామున జరిగిన ప్రమాదంలో, తాను నడుపుతున్న లారీకి మంటలు అంటుకోవడంతో డ్రైవర్ సజీవ దహనమయ్యాడు. ఈ ఘటనలో మరో ఐదుగురు గాయాలతో బయటపడ్డారు. 
 
మేకల లోడుతో కర్నూలు వైపు వెళ్తున్న లారీ, జాతీయ రహదారిపై ఉన్న ఒక సైన్‌బోర్డును ఢీకొట్టడంతో ఈ ప్రమాదం జరిగింది. లారీకి ఒక్కసారిగా మంటలు వ్యాపించడంతో డ్రైవర్ లోపలే చిక్కుకుపోయి అక్కడికక్కడే మరణించాడు, మిగిలిన వారు గాయాలతో బయటపడ్డారు. 
 
సమాచారం అందుకున్న పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది వెంటనే ఘటనా స్థలానికి చేరుకుని గంటలోపే మంటలను అదుపులోకి తెచ్చారు. ప్రమాదానికి గల కారణాలను నిర్ధారించేందుకు అగ్నిమాపక సిబ్బంది మరియు పోలీసులు మరిన్ని వివరాలను సేకరిస్తున్నారు.
About Writer
సెల్వి
Journalist since 2005. Former contributor at Eenadu & Andhra Jyothi Tamil Nadu Editions. Now in Sub Editor, Webdunia.... మరింత చదవండి
తర్వాతి కథనం
ఐఫోన్ డ్యూయో స్పెసిఫికేషన్లు, ఫీచర్లు... 5 నిమిషాల ఛార్జింగ్‌తో 5 గంటల వీడియో ప్లేబ్యాక్ (video)