మేకల లోడుతో వెళ్తున్న లారీలో మంటలు.. డ్రైవర్ సజీవ దహనం
Lorry
మేకల లోడుతో కర్నూలు వైపు వెళ్తున్న లారీ, జాతీయ రహదారిపై ఉన్న ఒక సైన్బోర్డును ఢీకొట్టడంతో ఈ ప్రమాదం జరిగింది. లారీకి ఒక్కసారిగా మంటలు వ్యాపించడంతో డ్రైవర్ లోపలే చిక్కుకుపోయి అక్కడికక్కడే మరణించాడు, మిగిలిన వారు గాయాలతో బయటపడ్డారు.
సమాచారం అందుకున్న పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది వెంటనే ఘటనా స్థలానికి చేరుకుని గంటలోపే మంటలను అదుపులోకి తెచ్చారు. ప్రమాదానికి గల కారణాలను నిర్ధారించేందుకు అగ్నిమాపక సిబ్బంది మరియు పోలీసులు మరిన్ని వివరాలను సేకరిస్తున్నారు.
