తిరుపతి: కొండను ఢీకొన్న లారీ.. అగ్నికి ఆహుతి.. డ్రైవర్కు ఏమైందంటే?
Lorry
వివరాల్లోకి వెళితే, పైపులతో నిండిన ఈ లారీ మహారాష్ట్రలోని బెర్హంపూర్ నుండి తిరుపతికి వెళ్తుండగా ఈ ఘటన జరిగింది. చంద్రగిరి సమీపంలోని బకరపేట ఘాట్ రోడ్డు వద్దకు చేరుకోగానే, డ్రైవర్ వాహనంపై నియంత్రణ కోల్పోవడంతో లారీ కొండను ఢీకొట్టింది.
ఢీకొట్టిన వెంటనే లారీ ఇంజిన్ నుండి మంటలు చెలరేగాయి. మంటలను గమనించిన డ్రైవర్ సకాలంలో వాహనం నుండి బయటపడి, ఎటువంటి గాయాలు లేకుండా సురక్షితంగా తప్పించుకున్నాడు. ఆ తర్వాత వ్యాపించిన మంటల్లో లారీ పూర్తిగా కాలిపోయింది.
మంటలను గమనించిన స్థానికులు పోలీసులకు మరియు అగ్నిమాపక సిబ్బందికి సమాచారం అందించారు. అగ్నిమాపక సిబ్బంది హుటాహుటిన ఘటనా స్థలానికి చేరుకుని మంటలను అదుపులోకి తెచ్చారు. చంద్రగిరి పోలీసులు ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.
