1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలంగాణ వార్తలు
  4. Father Kills Two Children, Attempts Suicide in Narayanpet

భార్య కాపురానికి రాలేదు.. కోపంతో ఇద్దరు పిల్లల్ని హత్య చేసిన తండ్రి.. ఎక్కడ?

Man Crime
మహబూబాబాద్ నారాయణపేటలో ఒక దిగ్భ్రాంతికరమైన ఘటన చోటుచేసుకుంది. ఒక వ్యక్తి తన ఇద్దరు పిల్లలను హత్య చేసి, ఆ తర్వాత ఆత్మహత్యకు ప్రయత్నించాడు. వివరాల్లోకి వెళితే.. శివరాములు అనే వ్యక్తి తన భార్య కాపురానికి తిరిగి రావడానికి నిరాకరించడంతో ఆగ్రహానికి గురై తన పిల్లలను హత్య చేశాడు. ఆ వ్యక్తి ఇద్దరు పిల్లలను ఉరివేసి చంపి, ఆ తర్వాత వారి మృతదేహాలను యాపల్ చెరువులో పడేశాడు. 
 
హత్యల అనంతరం, అతను విద్యుత్ తీగలను పట్టుకుని ఆత్మహత్యకు ప్రయత్నించినప్పటికీ, ఆ ప్రయత్నం విఫలమైంది. ఆ తర్వాత అతను పురుగుల మందు తాగాడు. దాంతో స్పృహ కోల్పోయాడు. స్థానికులు ఈ విషయాన్ని గమనించి, శివరాములును చికిత్స నిమిత్తం మహబూబ్‌నగర్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. 
 
ఈ ఘటనకు సంబంధించి దర్యాప్తు జరుగుతోందని పోలీసులు తెలిపారు. వైవాహిక కలహాల కారణంగా నిందితుడు తన పిల్లలను హత్య చేసినట్లు ఆరోపణలు వచ్చాయి. ప్రస్తుతం మహబూబ్‌నగర్ ప్రభుత్వ ఆసుపత్రిలో నిందితుడు చికిత్స పొందుతున్నాడు.
About Writer
సెల్వి
తర్వాతి కథనం
Konaseema: కోనసీమ జిల్లాలో గ్యాస్ బావిలో పేలుడు.. మంగళవారం కాస్త తగ్గింది..