ఎనిమిది నెలల పసిబిడ్డను ఎత్తుకెళ్లిన వాచ్వుమన్.. మూడు గంటల్లో కాపాడిన పోలీసులు
బోడుప్పల్లోని ఒక ఇంట్లో వాచ్వుమన్గా పనిచేస్తున్న మహిళ అపహరించిన ఎనిమిది నెలల పసిబిడ్డను, మల్కాజిగిరి కమిషనరేట్ పరిధిలోని మేడిపల్లి పోలీసులు మూడు గంటల వ్యవధిలోనే సురక్షితంగా రక్షించారు. నిందితురాలిని నల్ల దుర్గా భవానిగా గుర్తించి అరెస్టు చేశారు. చట్టపరమైన ప్రక్రియ పూర్తయిన తర్వాత ఆ పసిబిడ్డను తిరిగి తల్లిదండ్రులకు అప్పగించారు.
ఉప్పల్ డిప్యూటీ కమిషనర్ ఆఫ్ పోలీస్ సురేష్ కుమార్ మాట్లాడుతూ, "ఈ రోజు మధ్యాహ్నం సుమారు 3 గంటల సమయంలో, ఎనిమిది నెలల మగ పసిబిడ్డ అపహరణకు గురైనట్లు మేడిపల్లి ఇన్స్పెక్టర్కు డయల్ 100 ద్వారా సమాచారం అందింది" అని తెలిపారు. సమాచారం అందిన వెంటనే, ఇన్స్పెక్టర్, ఆయన బృందం స్పందించి ఆరు ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేశారు.
మేము ప్రధాన రైల్వే స్టేషన్లను అప్రమత్తం చేశాము. అలాగే దేవరకొండ, సూర్యాపేట డీఎస్పీలతో సమన్వయం చేసుకుని, మా బృందాలను అక్కడికి పంపామని... సాంకేతిక ఆధారాలు, సాంకేతిక సహకారంతో కీలకమైన ఆధారాలను సేకరించి, నిందితులను కర్మాన్ఘాట్ వద్ద గుర్తించామని చెప్పారు. అక్కడ ఆ పసిబిడ్డ సురక్షితంగా లభించాడని ఆయన తెలిపారు. తమ కుమారుడిని సురక్షితంగా అప్పగించినందుకు ఆ పసిబిడ్డ తల్లిదండ్రులు పోలీసులకు కృతజ్ఞతలు తెలిపారు.
