1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలంగాణ వార్తలు
  4. KCR Comes to Hospital For KTRs Son

హైదరాబాద్ ఏఐజీ ఆస్పత్రిలో కేసీఆర్.. మనవడు హిమాన్షుకు పరామర్శ (video)

KCR
KCR
తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ ఎర్రవల్లిలోని తన ఫామ్‌హౌస్‌కే పరిమితం కావడం వల్ల, గత కొంతకాలంగా ఆయన బహిరంగ కార్యక్రమాలకు దూరంగా ఉంటున్నారు. అయితే, తాజాగా ఆయన హైదరాబాద్‌లోని ఏఐజీ ఆసుపత్రికి వచ్చి తన మనవడు హిమాన్షును పరామర్శించారు. 
 
మాజీ ఐటీ మంత్రి కేటీఆర్ కుమారుడైన హిమాన్షు, జిమ్‌లో గాయపడ్డాడు. ప్రస్తుతం అతను హైదరాబాద్‌లోని ఏఐజీ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు. ఈ సంఘటన కారణంగా కేసీఆర్ ఆసుపత్రికి వచ్చారు. తన మనవడితో ఎంతో ఆప్యాయమైన అనుబంధం ఉన్న ఆయన, ఇప్పుడు హిమాన్షును పలకరించారు.
 
మరోవైపు, తన కుమారుడి ఆరోగ్య పరిస్థితి గురించి కేటీఆర్ సోషల్ మీడియాలో స్పందించారు. హిమాన్షు కోలుకుంటున్నాడని, కొద్ది రోజుల్లోనే సాధారణ స్థితికి వస్తాడని చెబుతూ, దీనిపై అనవసరమైన ఊహలకు తావివ్వవద్దని ఆయన ప్రజలను కోరారు.
About Writer
సెల్వి