1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలంగాణ వార్తలు
  4. Khammam man kills mother, daughters financial issues suspected

ఖమ్మం: తల్లి, ఇద్దరు పిల్లలను హత్య చేసిన వ్యక్తి.. భార్య కూడా?

murder
ఖమ్మం జిల్లా తల్లాడ మండలం గోపాలపేట గ్రామంలో శనివారం తెల్లవారుజామున ఓ వ్యక్తి తన తల్లి, ఇద్దరు పిల్లలను హత్య చేసి పరారయ్యాడు. పిట్టల వెంకటేశ్వర్లు గోపాలపేటలోని తన ఇంట్లో తల్లి, ఇద్దరు పిల్లలతో కలిసి నివసిస్తున్నాడు. తల్లి పిచ్చమ్మ(60), ఇద్దరు కుమార్తెలు నీరజ(10), ఝాన్సీ(6)లను హత్య చేశాడు. నేరం చేసిన తర్వాత అక్కడి నుంచి పారిపోయాడు. ఇంట్లో ముగ్గురు చనిపోయి ఉండటాన్ని స్థానికులు గుర్తించి పోలీసులకు సమాచారం అందించారు.
 
కుటుంబ కలహాలు, ఆర్థిక సమస్యలే నేరానికి కారణమని అనుమానిస్తున్నారు. మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది. కొన్నాళ్ల క్రితం వెంకటేశ్వర్లు భార్య అనుమానాస్పద స్థితిలో మృతి చెందింది.
About Writer
సెల్వి
తర్వాతి కథనం
కదులుతున్న బస్సులో మంటలు- తొమ్మిది మంది సజీవదహనం