1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలంగాణ వార్తలు
  4. Preeti Reddy Clarifies, No Plan to Join BJP, Focus on Digital India

మాజీ మంత్రి మల్లారెడ్డి కోడలు ప్రీతిరెడ్డి బీజేపీలో చేరుతారా?

prethi reddy
తెలంగాణ రాష్ట్రానికి చెందిన భారత రాష్ట్ర సమితి సీనియర్ నేత, మాజీ మంత్రి మల్లారెడ్డి కోడలు ప్రీతిరెడ్డి పేరు ఇటీవలికాలంలో వార్తల్లో బాగా వినిపిస్తోంది. ఆమె ఏ పని చేసినా అది ప్రధాన వార్తగా ప్రచురితమవుతోంది. తాజాగా ఆమె హైదరాబాద్ నాంపల్లిలోని భారతీయ జనతా పార్టీ రాష్ట్ర శాఖ ప్రధాన కార్యాలయానికి వెళ్ళారు. ఇది రాష్ట్ర రాజకీయాల్లో చర్చనీయాంశంగా మారింది. అక్కడ ఆమె పార్టీ ప్రధాన కార్యదర్శి చంద్రశేఖర్ తివారితో సమావేశమయ్యారు. దీంతో ఆమె బీజేపీలో చేరబోతున్నారంటూ జోరుగా ప్రచారం సాగుతోంది. దీనిపై ఆమె తాజాగా క్లారిటీ ఇచ్చారు. 
 
తమ భేటీకి ఎలాంటి రాజకీయ ప్రాధాన్యత లేదని చెప్పారు. తాను బీజేపీలో చేరడం లేదని స్పష్టం చేశారు. తాను విద్యావేత్తను అనే విషయాన్ని ప్రతి ఒక్కరూ గుర్తించుకోవాలని సూచించారు. తాను అన్ని పార్టీల నేతలను కలుస్తుంటానని చెప్పారు. డిజిటల్ ఇండియా కోసం అన్ని పార్టీల నేతలను కలుస్తున్నట్టు చెప్పారు. మల్లారెడ్డి విశ్వవిద్యాలయంలో ఏఐ క్యాంపస్ ప్రారంభోత్సవానికి ప్రధాని నరేంద్ర మోడీని ఆహ్వానించినట్టు ఆమె తెలిపారు. 
About Writer
ఠాగూర్
ఠాగూర్ పులపాక ప్రముఖ దినపత్రిక ఈనాడు, చెన్నై కార్యాలయంలో 'న్యూస్ కాంట్రిబ్యూటర్‌'గా జర్నలిజం ఓనమాలు నేర్చుకున్నారు. హైదరాబాద్ కార్యాలయంలో 'ఆంధ్రజ్యోతి' సబ్-ఎడిటర్ పని చేశారు. 2007 నుంచి 'వెబ్ దునియా'లో అసిస్టెంట్ ఎడిటర్‌‌గా విధులు నిర్వహిస్తున్నారు..... మరింత చదవండి
తర్వాతి కథనం
నీవంటే ఇష్టం లేదు.. నలుగురు ప్రియురాళ్లు ఉన్నారని చెప్పిన కాబోయే వరుడు.. ప్రాణాలు తీసుకున్న వధువు