1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలంగాణ వార్తలు
  4. Revanth Asks 100 Cr, KCR Asks CM Post

కేసీఆర్‌ను రూ. 100 కోట్లు అడిగిన రేవంత్ రెడ్డి.. కౌంటరిచ్చిన కేసీఆర్

kcrao
సాగునీటి కొరతతో రాష్ట్రంలో రైతులు ఆత్మహత్యలు చేసుకుంటున్నారని తెలంగాణ ప్రతిపక్ష నేత కేసీఆర్ ఇటీవల మండిపడ్డారు. ఈ దుస్థితిలో రైతుకు ఆర్థికంగా అండగా నిలిచేందుకు రైతులకు ఎకరాకు రూ.25 వేలు పరిహారం ఇవ్వాలని డిమాండ్‌ చేశారు.
 
ఈ విషయాన్ని సీఎం రేవంత్‌రెడ్డి ఎదుట ప్రస్తావించగా.."కేసీఆర్‌ తన ఎలక్టోరల్‌ బాండ్‌ నిధుల నుంచి ఇతర కంపెనీలు, వ్యక్తుల నుంచి వచ్చిన 100 కోట్ల రూపాయలను ఇవ్వవచ్చు. అప్పుడు ఆయన కోరిన నష్టపరిహారాన్ని సంతోషంగా పంపిణీ చేస్తాం.." అంటూ రేవంత్ చాకచక్యంగా దాటవేశారు. 
 
అయితే ఈరోజు మీడియాతో రేవంత్‌ చేసిన ప్రత్యారోపణపై కేసీఆర్‌ తనదైన శైలిలో స్పందించారు. "ప్రత్యర్థి పార్టీ నుంచి సీఎం రూ.100 కోట్లు అడగడం తమాషాగా ఉంది. చేతకాని పక్షంలో సీఎం పదవి నుంచి వైదొలగాలి. ఆ తర్వాత రైతులకు నష్టపరిహారం ఎలా ఇస్తారో చూసి సీఎం పని నేర్చుకోమన్నారు.
 
చివరకు బీఆర్‌ఎస్‌ ఎన్నికల నిధి నుంచి సీఎం రేవంత్‌ రూ. 100 కోట్లు అడగడం, దానికి ప్రతిఫలంగా కేసీఆర్‌ సీఎం పదవి ఇవ్వాలని కోరడంతో రైతు పరిహారంపై వాడివేడి చర్చ ముగిసింది.
About Writer
సెల్వి