సంబంధిత వార్తలు
- హర్మూజ్ జలసంధిలో కంటైనర్ నౌకపై దాడి చేసిన ఇరాన్
- రూ.7వేల కోసం తమ్ముడు, అతని గర్భిణీ భార్యను హతమార్చాడు.. ఎక్కడ?
- పశ్చిమాసియాలో కమ్ముకుంటున్న యుద్ధమేఘాలు... భారత్కు వచ్చిన చమురు ట్యాంకర్లు
- హవేరీలో ఘోర ప్రమాదం.. ఫ్లాట్ఫామ్కి దూసుకెళ్లిన బస్సు.. రెండేళ్ల బాలుడి మృతి (video)
- సేలంలో ఘోర ప్రమాదం.. ఎదురుగా నిల్చున్న వ్యక్తిని ఢీకొన్న బస్సు (video)
RTC workers: సమ్మె.. పెట్రోల్ పోసుకుని నిప్పంచికున్న ఆర్టీసీ డ్రైవర్ మృతి
RTC workers
తొలుత వరంగల్ ఎంజీఎంకు, ఆ తర్వాత మెరుగైన చికిత్స కోసం హైదరాబాద్కు తరలించారు. అయితే, పరిస్థితి విషమించడంతో ఆయన ప్రాణాలు కోల్పోయారు. శంకర్గౌడ్ మరణంతో రాష్ట్రవ్యాప్త ఆర్టీసీ సమ్మెలో తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. ఇదే తరహాలో నల్గొండ, ఖమ్మం జిల్లాల్లో మరో ఇద్దరు డ్రైవర్లు కూడా ఆత్మహత్యాయత్నానికి పాల్పడటం కార్మికుల్లో నెలకొన్న తీవ్ర ఆందోళనను స్పష్టం చేస్తోంది. శంకర్గౌడ్ మృతికి ప్రభుత్వ వైఖరే కారణమని కార్మిక సంఘాలు ఆరోపిస్తున్నాయి.
ఈ వరుస పరిణామాలతో ప్రభుత్వం అప్రమత్తమైంది. కార్మికులు ఆత్మహత్యల వంటి తొందరపాటు చర్యలకు పాల్పడవద్దని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, మంత్రులు కోమటిరెడ్డి వెంకట్రెడ్డి, పొన్నం ప్రభాకర్తో సహా పలువురు విజ్ఞప్తి చేశారు. సమస్యల పరిష్కారంపై ప్రభుత్వం చిత్తశుద్ధితో ఉందని, చర్చలకు సిద్ధంగా ఉన్నామని తెలిపారు. ఇందులో భాగంగా శుక్రవారం కార్మిక సంఘాల నాయకులతో ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క నేతృత్వంలో మంత్రుల కమిటీ చర్చలు జరపనుంది.
