సేలంలో ఘోర ప్రమాదం.. ఎదురుగా నిల్చున్న వ్యక్తిని ఢీకొన్న బస్సు (video)
తమిళనాడు సేలంలో ఘోర ప్రమాదం చోటుచేసుకుంది. ఎదురుగా మనిషి నిల్చుని వున్న విషయాన్ని కూడా గమనించని సేలం బస్సు డ్రైవర్ ఓ వ్యక్తిపై బస్సును పోనిచ్చాడు. ఈ ఘటనకు సంబంధించిన దృశ్యాలు సీసీటీవీలో రికార్డ్ అయ్యాయి. ఈ వీడియోలో రోడ్డుపైకి వచ్చిన మేకలను పక్కకు తోలుతూ కనిపించాడు ఓ వ్యక్తి.. ఈ సందర్భంగా ఎదురెదురుగా వచ్చిన వాహనాలు మెల్లమెల్లగా మేకల కోసం ఆగిపోయాయి.
అయితే తమిళనాడు ప్రభుత్వ బస్సు మాత్రం ఆగకుండా రోడ్డుకు పక్కన నిలబడి వున్న వ్యక్తిపై దూసుకెళ్లింది. ఈ క్రమంలో బస్సు ముందు చక్రాలు ఆ వ్యక్తికి పైనుంచి పోనిచ్చాడు. దీన్ని చూసిన స్థానికులు షాక్ అయ్యారు. ఇంకా బస్సు డ్రైవర్ను తిట్టపోశారు. మనిషి నిలబడి వుండటాన్ని ఆ డ్రైవర్ గమనించలేదా అని నెటిజన్లు ఫైర్ అయ్యారు.