1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలంగాణ వార్తలు
  4. Three Inter Students Die in Highway Crash

జగిత్యాలలో ఘోరం.. ముగ్గురు ఇంటర్ విద్యార్థులు మృతి

road accident
జగిత్యాలలో ఘోరం జరిగింది. బుధవారం రాత్రి జగిత్యాల జిల్లాలోని ధర్మపురి వద్ద జాతీయ రహదారిపై జరిగిన రోడ్డు ప్రమాదంలో ముగ్గురు ఇంటర్మీడియట్ విద్యార్థులు మృతి చెందగా, మరో తొమ్మిది మంది గాయపడ్డారని పోలీసులు తెలిపారు. 
 
మృతులు మదాసు అమర్‌నాథ్ (17), పడాల రిశ్వంత్ (17), కోల మయాంక్ (16) ప్రయాణిస్తున్న మోటార్‌సైకిల్‌ను ట్రక్కు ఢీకొనడంతో వారు అక్కడికక్కడే మరణించారు.
 
 మంచిర్యాల జిల్లా నుంచి వస్తున్న ట్రక్కు, మరో వాహనాన్ని ఓవర్‌టేక్ చేసే ప్రయత్నంలో అదుపుతప్పి ఎదురుగా వస్తున్న బైక్‌ను ఢీకొట్టింది. ఈ ధాటికి ముగ్గురు విద్యార్థులు మరణించారు.
 
ఆ తర్వాత అదే ట్రక్కు, కొమరం భీమ్ ఆసిఫాబాద్ జిల్లా నుంచి భక్తులతో వెళ్తున్న ఆటోరిక్షాను ఢీకొట్టడంతో అది బోల్తా పడింది. ఆటోలోని తొమ్మిది మంది ప్రయాణికులు గాయపడగా, వారిని 108 అంబులెన్స్‌లలో ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. 
 
పోలీసులు కేసు నమోదు చేసి, మృతదేహాలను పోస్ట్‌మార్టం కోసం పంపించారు. ప్రాథమిక విచారణలో, ట్రక్కు డ్రైవర్ అతివేగం, నిర్లక్ష్యంగా ఓవర్‌టేక్ చేయడమే ఈ ప్రమాదానికి కారణమని తేలింది.
About Writer
సెల్వి
తర్వాతి కథనం
ఏయ్ మిస్టర్ గోపాల రావు : కేసీ సీఆర్ కాళ్లు పట్టుకునైనా నీ ఇంటి సంగతి చూస్తా : పేర్ని నాని వార్నింగ్