1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలంగాణ వార్తలు
  4. Wife Killed Husband

Wife: భర్త వేధింపులు.. తాగొచ్చాడు.. అంతే కర్రతో కొట్టి చంపేసిన భార్య

Woman
భర్త వేధింపులు భరించలేక భార్య కర్రతో కొట్టి హతమార్చింది. తాజాగా మేడ్చల్ పట్టణంలో జరిగిన మరో ఘటన రాష్ట్రంలో సంచలనం సృష్టించింది. తాగొచ్చిన భర్త వేధింపులను తట్టుకోలేక భార్య భర్తను కడతేర్చింది. మేడ్చల్ పట్టణం, ఇంద్రానగర్ కాలనీలో శ్రీనివాస్ (45), సావిత్రి దంపతులు నివసిస్తున్నారు. 
 
శ్రీనివాస్ భవన కార్మికుడిగా పనిచేస్తున్నాడు. అదే సమయంలో అతడు మద్యానికి బానిసయ్యాడు. నిత్యం మద్యం సేవించి భార్య సావిత్రిని వేధింపులకు గురిచేశాడు. కానీ అతనిలో మార్పు రాలేదు. బుధవారం మరోసారి అతడు తన భార్యతో గొడవపడ్డాడు. దీంతో ఆమె భరించలేక అతడిని హతమార్చింది. క్షణకావేశంలో కర్రతో అతడిపై దాడి చేసింది. ఆ దాడిలో తీవ్రంగా గాయపడిన శ్రీనివాస్ అక్కడికక్కడే ప్రాణాలు  కోల్పోయాడు. 
 
సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే సంఘటనా స్థలానికి చేరుకున్నారు. కుటుంబ కలహాల నేపథ్యంలోనే ఈ హత్య జరిగిందని పోలీసులు నిర్ధారణకు వచ్చారు. ఈ హత్యకు భార్యే కారణమని అంగీకరించింది. దీంతో నిందితురాలు సావిత్రపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు.
About Writer
సెల్వి
తర్వాతి కథనం
Tomato virus: మధ్యప్రదేశ్‌లో విజృంభించిన టమోటా వైరస్.. చిన్నారులు జాగ్రత్త