గురువారం, 25 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలంగాణ
Written By జె
Last Modified: గురువారం, 30 జనవరి 2020 (21:13 IST)

ప్రియుడిపై మోజు, భర్తను అత్యంత దారుణంగా చంపించిన భార్య

వివాహేతర సంబంధాలు పచ్చని కాపురాలను ఛిన్నాభిన్నం చేస్తున్నాయి. కుటుంబంతో ఎంతో సంతోషంగా బ్రతకవలసినవారు ఈ అక్రమ సంబంధాల కారణంగా జీవితాలను నాశనం చేసుకుంటున్నారు. ప్రియుడిపై మోజుతో కట్టుకున్న భర్తనే కడతేర్చింది ఇల్లాలు. 
 
తెలంగాణ రాష్ట్రంలోని నల్గొండ జిల్లా కేంద్రంలోని చైత్యనపురి కాలనీలో జరిగింది. నల్గొండ, చైతన్యపురి కాలనీకి చెందిన సోమ కేశవులు అనే రియల్టర్ ఉండగా, ఈయనకు భార్య స్వాతి ఉన్నారు. ఈమెకు అదే ప్రాంతానికి ప్రదీప్‌ అనే వ్యక్తితో వివాహేతర సంబంధం ఏర్పడింది. ఈ వ్యవహారం మూడేళ్లుగా కొనసాగుతూ వస్తోంది. అయితే, ఈ విషయం భర్తకు తెలియడంతో కుటుంబంలో గొడవలు మొదలయ్యాయి
 
భర్త భార్యను వేధించం మొదలుపెట్టాడు. తరచుగా ఫోన్‌లో మాట్లాడడం, వాట్సప్‌లో ఫొటోలు ఉండటంతో ఇద్దరి మధ్య తరచుగా ఘర్షణలు జరిగాయి. దీంతో స్వాతి తన భర్త అడ్డు తొలగించుకోవాలని నిర్ణయించుకుంది. 2 లక్షలు ఇస్తానని స్వాతి ప్రియుడికి చెప్పింది. దీంతో ప్రియుడు ప్రదీప్‌ సోమ కేశవులును హత్య చేసేందుకు బొట్టుగూడలో ప్రింటర్‌గా పనిచేస్తున్న కొడిదేటి శివకుమార్‌ను సంప్రదించాడు. స్వాతితో తనకున్న సంబంధాన్ని వివరించాడు. స్వాతి భర్త అడ్డు తొలగించాలని చెప్పడంతో హత్యకు ప్లాన్‌ వేశారు.
 
వీరిద్దరితో పాటు వెంకపల్లి గ్రామానికి చెందిన కంబం ప్రసాద్, బొట్టుగూడకు చెందిన ఆటోడ్రైవర్‌ చింతపల్లి నగేశ్, ప్రదీప్‌ అందరూ కలిసి హత్య చేశారు. మద్యంలో మత్తు కలిపి ఇవ్వడంతో కేశవులు అపస్మారకస్థితిలోకి జారుకున్నాడు. ఆ తర్వాత అందరూ కలిసి హత్య చేశారు. అతడి గొంతు పిసికి, తలపై బండరాయితో మోదటంతో ఆ దెబ్బలను తాళలేక కేశవులు ప్రాణాలు కోల్పోయాడు. దీనిపై పోలీసులు కేసు నమోదు చేసి విచారణ చేపట్టి.. హత్య కేసులోని మిస్టరీని ఛేదించారు.