సంబంధిత వార్తలు
- బండి సంజయ్ నిరుద్యోగ మహాధర్నా: కోర్టు నుంచి అనుమతి
- టీపీఎస్సీ పరీక్ష పేపర్ లీక్ కొత్త ట్విస్ట్ : మరో పదిమందికి ఉద్యోగులకు లింకు!
- టీఎస్ పీఎస్సీ పేపర్ లీకేజీ కేసు : రేణుక దంపతులపై వేటు
- టీఎస్పీఎస్సీ పేపర్ లీకేజీ వ్యవహారంలో స్టేటస్ రిపోర్టు ఇవ్వండి... తెలంగాణ హైకోర్టు
- టీఎస్పీఎస్సీ పేపర్ లీక్ : నా భర్తపై థర్డ్ డిగ్రీ ప్రయోగిస్తున్నారు : భార్య పటిషన్
టీఎస్పీఎస్సీ పేపర్ లీక్ వ్యవహారం.. మరో కొత్త ట్విస్ట్.. ఏంటది?
టీఎస్పీఎస్సీ పేపర్ లీక్ వ్యవహారం తెలంగాణలో దుమారం రేపుతోంది. ఈ కేసులో తాజాగా మరో ట్విస్ట్ నెలకొంది. ప్రశ్నపత్రాల లీక్ విషయం టిఎస్పిఎస్సి కమీషన్ కార్యాలయంలో పని చేస్తున్న మరో ఇద్దరు ఉద్యోగులకు ముందే తెలుసని అధికారులు నిర్ధారించారు.
అసిస్టెంట్ సెక్షన్ ఆఫీసర్ షమీమ్, ఔట్ సోర్సింగ్ డేటా ఎంట్రీ ఆపరేటర్ రమేష్ లు ముందే గుర్తించారు. కానీ ఈ వ్యవహారంలో ప్రవీణ్, ప్రశ్నాపత్రాల లీకేజీ అంశం ఉన్నతాధికారులకు చెప్తురామేనని భయపడ్డారు. ఈ క్రమంలో షమీమ్, రమేష్లను ప్రలోభ పెట్టారు.
కాగా షమీమ్, రమేష్ల నుండే న్యూజిలాండ్లో ఉన్న ప్రశాంత్కు, సైదాబాద్కు చెందిన సురేష్కు పేపర్ లీక్ చేసినట్లు తెలుస్తుంది. ఇక ఈ ముగ్గురిని ఇప్పటికే కోర్టు ఐదు రోజుల సిట్ కస్టడీకి అనుమతి ఇచ్చింది. దీనితో బుధవారం చంచల్ గూడ జైలు నుండి ఆ ముగ్గుర్ని అదుపులోకి తీసుకొని విచారించనున్నారు.