సంబంధిత వార్తలు
- మంత్రి శ్రీనివాస్ గౌడ్కు భద్రత పెంపు ... నిఘా విభాగం నిర్ణయం
- నేడు పోలవరానికి ఏపీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి
- అసెంబ్లీలో 3 రాజధానుల బిల్లు ప్రవేశపెడతామో లేదో మీరే చూడండి: మంత్రి బొత్స
- తెరాస మంత్రి శ్రీనివాస్ గౌడ హత్యకు రూ.15 కోట్ల సుపారీ : స్టీఫెన్ రవీంద్ర
- భారతదేశం శాంతి, సుఖంగా వుందంటే అందుకు ప్రధాని మోదీ కారణం: సినీ నటుడు సుమన్
వరంగల్ ఉమ్మడి జిల్లాలో మంత్రి హరిష్ రావు టూర్
వరంగల్ ఉమ్మడి జిల్లాలో మంత్రి హరీష్ రావు పర్యటించనున్నారు. ముఖ్యంగా ములుగులో మంత్రి హరీశ్రావు ఈ సర్వేను మొదలుపెట్టనున్నారు. ఈ ప్రాజెక్ట్లో భాగంగా 18 ఏళ్లు నిండిన 7లక్షల మందికి పలు రకాల వైద్య పరీక్షలు చేయబోతున్నారు. ఇందుకోసం ములుగు జిల్లాలో 153 హెల్త్ టీమ్స్ను ఏర్పాటు చేశారు.
పైలట్ ప్రాజెక్ట్లో వచ్చే సాధకబాధకాలను గుర్తించి, మార్పులు చేర్పుల తర్వాత రాష్ట్ర వ్యాప్తంగా సర్వే చేపట్టనున్నారు. మరోవైపు మంత్రుల పర్యటనలకు సంబంధించిన ఏర్పాట్లను ఆయా జిల్లాల ఆఫీసర్లు పూర్తి చేశారు.
ములుగు ఏరియా ఆసుపత్రిని జిల్లా ఆసుపత్రిగా మార్చడమే కాకుండా రేడియాలజీ ల్యాబ్ భవన నిర్మాణాలకు మంత్రి హరీశ్ రావు శంకుస్థాపన చేస్తారు. పిల్లల ఆరోగ్య కేంద్రాన్ని ప్రారంభిస్తారు. తర్వాత నర్సంపేట, పరకాల నియోజకవర్గాల్లో పర్యటిస్తారు.
తర్వాతి కథనం