సంబంధిత వార్తలు
- తెలంగాణాలో వైఎస్.షర్మిల ఎస్సీఎస్టీ అట్రాసిటీ కేసు - అరెస్టు.. పాదయాత్రకు మళ్లీ బ్రేక్
- ఆంధ్రా విశ్వవిద్యాలయంలో గంజాయి విక్రయిస్తున్న సెక్యూరిటీ గార్డులు
- ఢిల్లీ లిక్కర్ స్కామ్ : ఎమ్మెల్సీ కవిత చార్టెడ్ అకౌంటెంట్ అరెస్టు
- హైదరాబాద్లో ఆన్లైన్ వ్యభిచారం గుట్టురట్టు.. నిర్వాహకులు అరెస్టు
- నవీ ముంబైలో మతిస్థిమితం లేని బాలికపై అత్యాచారం
అమితాబ్ బచ్చన్ బంధువులను మోసం చేసిన సంధ్య కన్వెన్షన్ ఎండీ.. అరెస్టు
బాలీవుడ్ సూపర్ స్టార్ అమితాబ్ బచ్చన్ బంధువులను మోసం చేసిన కేసులో హైదరాబాద్ నగరానికి చెందిన సంధ్య కన్వెన్షన్ మేనేజింగ్ డైరెక్టర్ శ్రీధర్ను ఢిల్లీ పోలీసులు అరెస్టు చేశారు. సోమవారం ఉదయం భాగ్యనగరికి వచ్చిన పోలీసులు.. శ్రీధర్ను ఆయన నివాసంలోనే అదుపులోకి తీసుకున్నారు. కాగా, శ్రీధర్పై ఇప్పటికే అనేక రకాలైన మోసం కేసులు ఉన్నాయి.
ఈ కేసు వివరాలను పరిశీలిస్తే, ఓ సివిల్ కేసు వ్యవహారాల్లో తమ వద్ద రూ.250 కోట్ల మేరకు మోసం చేశారంటూ శ్రీధర్పై ఢిల్లీ పోలీసులకు అమితాబ్ బచ్చన్ బంధువులు ఫిర్యాదు చేశారు. దీనిపై కేసు నమోదు చేసిన పోలీసులు.. పూర్తి స్థాయిలో విచారణ జరిపారు. ఈ విచారణలో శ్రీధర్ మోసం చేసినట్టు నిర్ధారించారు. దీంతో ఆయన్ను అదుపులోకి తీసుకున్నారు అయితే శ్రీధర్ అరెస్టు విషయాన్ని పోలీసులు గోప్యంగా ఉంచినప్పటికీ బహిర్గతమైంది.
