బుధవారం, 24 ఏప్రియల్ 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. గుసగుసలు
Written By డివి
Last Updated : గురువారం, 18 ఫిబ్రవరి 2021 (18:11 IST)

రాధేశ్యామ్ ట్రైన్ సెట్ కోసం 1.8 కోట్లు ఖర్చు

Radhesyam train set
ప్ర‌భాస్, పూజా హెగ్డే కాంబినేష‌న్‌లో వ‌స్తోన్న చిత్రం `రాధేశ్యామ్`. ఈ సినిమా చిత్రీక‌ర‌ణ‌లో ఒక్కో స్టిల్ బ‌య‌ట‌కు వ‌స్తోంది. మొద‌ట‌లో ట్రెయిన్ స్టిల్ బ‌య‌ట‌కు వ‌చ్చింది. ఆ త‌ర్వాత గ్లింప్స్ ఆఫ్ రాధేశ్యామ్ పేరుతో ఓ స్పెషల్ వీడియోను విడుదల చేసింది. ఇటీవ‌లే కృష్ణంరాజుతో కూడిన ఫొటోను బ‌య‌ట‌కు వ‌దిలింది చిత్ర యూనిట్ కాగా, ఈ సినిమా చారిత్ర‌క నేప‌థ్యంలో సాగే డ్రామా క‌నుక ఇందుకు ఆరోజుల్లో వున్న‌టువంటి ట్రెయిన్ కోసం భారీగా వెచ్చించార‌ట‌. పురాతన రైల్వే స్టేషన్ సెట్ ఆకట్టుకున్నాయి.

ఆ వీడియోలో కనిపించిన ట్రైన్ సెట్ కోసం ఏకంగా 1.8 కోట్లు రూపాయలు ఖర్చు పెట్టార‌ని తెలుస్తోంది. ఈ సెట్ కోసం 250 మంది 30 రోజుల పాటు కష్టపడ్డారట. ఇటలీ నేపథ్యంలో తెరకెక్కనున్న ఈ చిత్రం కోసం ఎంతో జాగ్రత్తగా పురాతన ఇటలీ లుక్‌ను తీసుకొచ్చారట. పాన్‌ ఇండియా స్థాయిలో విడుదలవుతున్న ఈ చిత్రం యూవీ బ్యానర్‌పై రూపొందుతోంది. జూలై 30న సినిమా విడుదలవుతోంది.