1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. గుసగుసలు
  4. 1.8 crore for Radhe Shyam train set

రాధేశ్యామ్ ట్రైన్ సెట్ కోసం 1.8 కోట్లు ఖర్చు

Radhe syam train set
Radhesyam train set
ప్ర‌భాస్, పూజా హెగ్డే కాంబినేష‌న్‌లో వ‌స్తోన్న చిత్రం `రాధేశ్యామ్`. ఈ సినిమా చిత్రీక‌ర‌ణ‌లో ఒక్కో స్టిల్ బ‌య‌ట‌కు వ‌స్తోంది. మొద‌ట‌లో ట్రెయిన్ స్టిల్ బ‌య‌ట‌కు వ‌చ్చింది. ఆ త‌ర్వాత గ్లింప్స్ ఆఫ్ రాధేశ్యామ్ పేరుతో ఓ స్పెషల్ వీడియోను విడుదల చేసింది. ఇటీవ‌లే కృష్ణంరాజుతో కూడిన ఫొటోను బ‌య‌ట‌కు వ‌దిలింది చిత్ర యూనిట్ కాగా, ఈ సినిమా చారిత్ర‌క నేప‌థ్యంలో సాగే డ్రామా క‌నుక ఇందుకు ఆరోజుల్లో వున్న‌టువంటి ట్రెయిన్ కోసం భారీగా వెచ్చించార‌ట‌. పురాతన రైల్వే స్టేషన్ సెట్ ఆకట్టుకున్నాయి.

ఆ వీడియోలో కనిపించిన ట్రైన్ సెట్ కోసం ఏకంగా 1.8 కోట్లు రూపాయలు ఖర్చు పెట్టార‌ని తెలుస్తోంది. ఈ సెట్ కోసం 250 మంది 30 రోజుల పాటు కష్టపడ్డారట. ఇటలీ నేపథ్యంలో తెరకెక్కనున్న ఈ చిత్రం కోసం ఎంతో జాగ్రత్తగా పురాతన ఇటలీ లుక్‌ను తీసుకొచ్చారట. పాన్‌ ఇండియా స్థాయిలో విడుదలవుతున్న ఈ చిత్రం యూవీ బ్యానర్‌పై రూపొందుతోంది. జూలై 30న సినిమా విడుదలవుతోంది.
About Writer
డివి
తర్వాతి కథనం
నితిన్ లేక‌పోతే ‘చెక్‌’ లేదుః ద‌ర్శ‌కుడు చంద్రశేఖర్‌ యేలేటి