ఏషియన్ సురేష్ ఎంటర్టైన్మెంట్ ద్వారా కాగితం పడవలు రిలీజ్
Vardhan, Krishnapriya
ఇప్పటికే విడుదలైన గ్లింప్స్, ట్రైలర్ కి అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది. తాజాగా చిత్ర బృందం విడుదల తేదీని అధికారికంగా ప్రకటించింది. జూలై 24న ఈ చిత్రం ఏషియన్ సురేష్ ఎంటర్టైన్మెంట్ ద్వారా గ్రాండ్గా ప్రేక్షకుల ముందుకు రానుంది.
తెలుగు చిత్ర పరిశ్రమలో ప్రతిష్టాత్మకమైన పంపిణీ సంస్థల్లో ఒకటైన ఏషియన్ సురేష్ ఎంటర్టైన్మెంట్ ఈ చిత్రాన్ని విడుదల చేస్తుండటం విశేషం.
ఒక సినిమా కంటెంట్పై బలమైన నమ్మకం ఉన్నప్పుడే ఇలాంటి ప్రముఖ సంస్థలు ముందుకు వస్తాయి. దీంతో 'కాగితం పడవలు' పై పరిశ్రమ వర్గాల్లోనూ, ప్రేక్షకుల్లోనూ మరింత ఆసక్తి నెలకొంది.
ఈ చిత్రానికి AIS.నౌఫల్ రాజామ్యూజిక్ అందిస్తున్నారు. రుద్రసాయి డీవోపీగా పని చేస్తున్నారు, జెస్విన్ ప్రభు ఎడిటర్. ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ ఎం.హిమ బిందు. త్వరలోనే ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది.
తర్వాతి కథనం
