బుధవారం, 24 ఏప్రియల్ 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By ఠాగూర్
Last Updated : మంగళవారం, 3 డిశెంబరు 2019 (09:27 IST)

వీరాభిమానికి రజినీకాంత్ పాదాచాలనం.. ఫోటో వైరల్

సౌత్ ఇండియా సూపర్ స్టార్ రజినీకాంత్... మరోమారు వార్తల్లోకెక్కారు. ఎంత ఎత్తుకు ఎదిగినా అంత సాదాసీదాగా ఉండే తలైవా.. ఇపుడు తన వీరాభిమానికి పాదాచాలనం చేసి హిమాలయా శిఖరమంత ఎత్తుకు ఎదిగిపోయారు. ప్రత్యేక ప్రతిభావంతుడుగా గుర్తింపు పొందిన ఓ వీరాభిమానికి రజినీకాంత్ పాదాచాలనం చేశారు. 
 
ఈ వివరాలను పరిశీలిస్తే, పుట్టినతేదీ ప్రకారం ఈ నెల 12వ తేదీన రజినీకాంత్ పుట్టినరోజు వేడుకలు జరుగనున్నాయి. ఈ వేడుకలను ఘనంగా నిర్వహించేందుకు ఆయన అభిమాన సంఘాలు భారీ ఎత్తున ఏర్పాట్లు చేస్తున్నాయి. 
 
అయితే, ఈ సూపర్ స్టార్ మాత్రం తన పుట్టిన తిథి, నక్షత్రం ప్రకారం సోమవారం రోజు పుట్టిన రోజును జరుపుకున్నారు. చెన్నైలోని తన నివాసంలో జరిగిన ఓ కార్యక్రమంలో కేరళకు చెందిన వీరాభిమానిని ప్రత్యేకంగా పిలిపించుకుని కలిశారు. 
 
ఈ వీరాభిమాని ప్రత్యేక ప్రతిభావంతుడు కూడా. ఇతనికి రజినీకాంత్‌తో కరచాలనం చేసేందుకు రెండు చేతులు లేవు. దీంతో రజనీ అతని పాదాలను తాకి పాదచాలనం చేశారు. అతనితో కాసేపు ముచ్చటించారు. 
 
ఈ పాదాచాలానికి సంబంధించిన ఫోటోలు మాత్రం ఇపుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఈ ఫోటోలను ప్రముఖ కొరియోగ్రాఫర్, దర్శకుడు, హీరో అయిన రాఘవ లారెన్స్ తన ట్విట్టర్ ఖాతాలో పోస్ట్ చేశారు.